గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్న టిఆర్ఎస్ తాజాగా 56 స్థానాలు గెలుచుకుంది. అయినా సరే మేమే నంబర్ వన్ అన్న రీతిలో సంబరాలు చేసుకుంటున్న టీఆర్ఎస్ శ్రేణులకు ఫలితాలు వచ్చిన తరువాత ఉదయం షాకింగ్ న్యూస్ వినిపించినట్లు తెలంగాణ రాజకీయ వర్గాలలో వార్తలు వస్తున్నాయి.
మొత్తం టోటల్ పర్సంటేజ్ చూసుకుంటే ఎంఐఎం కి అదే విధంగా టిఆర్ఎస్ పార్టీకి భారీ డ్యామేజ్ ఓటింగులో జరిగిందని తెలుస్తోంది. జరిగిన గ్రేటర్ ఎన్నికల లో హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ భారతీయ జనతా పార్టీకి దక్కింది. 31.43 శాతం ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 30. 79 శాతం ఓట్లు ఎంఐఎం పార్టీకి 15.97 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 5.95 శాతం ఓట్లు.
ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో సంఖ్య పరంగా చూసుకుంటే లెక్క లు ఇలా ఉన్నాయి…బీజేపీకి 12,13,900 లక్షల ఓట్లు రాగా టిఆర్ఎస్ పార్టీకి 11,89,200 ఓట్లు వచ్చాయి. మొత్తంమీద చూసుకుంటే స్థానాల పరంగా టిఆర్ఎస్ పార్టీ గెలిచిన గాని ఓట్లు పరంగా చూసుకుంటే బిజెపి ముందంజలో ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో నిజమైన విన్నర్ కమలం పార్టీ అని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతం కి చెందిన వారు అనగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పిలిచే తెలంగాణ సెటిలర్లు టిఆర్ఎస్ పార్టీని ఆదరించక పోయి ఉంటే టిఆర్ఎస్ భారీ పతనానికి చేరి ఉండేదన్న టాక్ తాజాగా వినబడుతుంది. దాదాపు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్లు ఉండే ప్రాంతాలలో టిఆర్ఎస్ 27 స్థానాలు గెలవడంతో గ్రేటర్లో తన పట్టు నిలుపుకోవటం జరిగిందట. ఏ మాత్రం తెలంగాణలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్లు బిజెపికి మొగ్గుచూపి ఉంటే.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేరేలా ఉండేదని టిఆర్ఎస్ పార్టీ పతనానికి నాంది అనే వార్తలు వచ్చేవి అని విశ్లేషకులు అంటున్నారు.