నేటి సమాజంలో అమ్మాయిలు అబ్బాయిల చేతుల్లో దారుణంగా మోసపోతూనే ఉన్నారు. స్నేహం పేరుతో, ప్రేమల పేరుతో, పెళ్లిల్ల పేరుతో కూడా అమ్మాయిల బతుకులు ఆగం అవుతున్నాయి. ప్రేమించలేదని అమ్మాయిలపై యాసిడ్ దాడులు, కత్తులతో అతి కిరాతంగా చంపడాలు, లైంఘిక దాడులకు ఒడిగడుతూనే ఉన్నారు. అందుకే నేటి తల్లిదండ్రులు ఆడపిల్లలను కనాలంటేనే భయపడుతున్నారు. భయటకని వెళ్లిన తమ కూతురు మళ్లీ తిరిగి వచ్చే దాకా టెన్షన్ పడాల్సి రావడం దారుణం. అయితే నేటి సమాజంలో ప్రేమ పెళ్లిళ్లకు నేటి తల్లిదండ్రులు తీవ్ర వ్యతిరేఖత చూపెడుతుంటారని చాలా మంది భావిస్తుంటారు. కాని వారి బాధను మాత్రం కొందరే అర్థం చేసుకుంటారనేది జగమెరిగిన సత్యం. ప్రేమ పెళ్లిళ్లు అనేవి సమాజ వ్యతిరేకం కాదు.
కాని దాని పరిణామాలను ధృష్టిలో ఉంచుకునే తల్లిదండ్రులు ప్రేమ వివాహాలకు పిల్లలను దూరంగా ఉంచుతున్నారు. దానికి గల కారణాలను మనం ప్రతి నిత్యం వార్తల్లోనూ, సోషల్ మీడియాలోనూ చూస్తూనే ఉన్నం. ప్రేమ పేరుతో అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలే ఇందుకు కారణం. అయితే అందరూ అలాంటి వారే ఉంటారని అనుకోవడం పొరపాటే.. కాని ప్రేమించిన ప్రతి వ్యక్తి అమ్మాయిలను మోసం చేయకుండా ఉంటారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేని మాటే.. అయితే ప్రేమిస్తే జీవితాంతం కలిసుండాలి.. లేదా ప్రేమించిన యువతి సంతోషం కోసం ప్రయత్నించాలి. కాని ప్రేమ ఓడిపోయింది…. దానికి పరిష్కారం చావొక్కటే అంటే మాత్రం అది అసమర్థతే అవుతుంది. ప్రేమ నిలవకపోతే తాను చావడమో.. లేక ఆ అమ్మాయిని చంపడమో.. లేక ఇద్దరూ చావడమో చేసేస్తుంటారు.
కాని ప్రేమ ఒక్కటే లైఫ్ కాదనే విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిది. అయితే ఒక అబ్బాయి తను ప్రేమించి అమ్మయి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఇద్దరి పెళ్లి కలిసి జరగడం లేదని ఇద్దరు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. కాని ఆ అమ్మాయి చనిపోవడానికి నిరాకరించింది. ఇంకేముంది ఆ యువతిని అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. వివరాళ్లోకి వెళితే… కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన షాహిదా బేగం, రఘు అనే ఇద్దరు మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. వారు పెళ్లి కూడా చేసుకోవాలను కున్నారు. కాని అందుకు వారి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దాంతో రఘు కలిసి చనిపోవాలని నిర్ణయించుకుని షాహిదాను కూడా ఒప్పించాడు.
కాని షాహీదా తర్వాత అందుకు తన నిర్ణయాన్ని మార్చుకుంది. రఘు పురుగుల మందు తాగినా.. షాహిదా మాత్రం తాగలేదు. అందుకు ఆమెపై రఘు కోపం పెంచుకుని ఆమెను ఎలాగైనా చంపాలనుకున్నాడు. అనుకున్న ప్రకారమే వేరే వ్యక్తితో పెళ్లికి సిద్దమవుతున్న షాహిదాను ఈ నెల 17 న మాట్లాడాలని పిలిచి బయటకు తీసుకెళ్లాడు. కూతురు కనబడకపోవడంతో రఘును ప్రశ్నించారు ఆ యువతి తల్లిదండ్రులు. కాని రఘు అందుకు తగిన సమాధానం చెప్పకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే షాహిదా తుంబిగనూరు సమీపంలోని హెచ్చేల్సీ కాలువలో శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు. దాంతో రఘుపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.