(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
దేశ వ్యాప్తంగా సిట్టింగ్ లు మరియు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ లో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర హైకోర్టు లకు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ ఏడాది లోపు పూర్తి చేయాలన్న పిటిషన్ పై జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల హైకోర్టులకు పలు సూచనలు చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను రోజువారీ విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సి.బి.ఐ, ఏ సీ బీ, ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
వివిధ హైకోర్టులు ఇచ్చిన గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా 2556 సిట్టింగ్ ప్రజా ప్రతినిధులు సహా మొత్తం 4442 పెండింగులో ఉన్నాయని ఆమికస్క్యూరీ గతంలో సుప్రీం కోర్టుకు తెలిపింది. ఏపీలో 106, తెలంగాణలో 118 మంది పై కేసుకు పెండింగ్ లో ఉన్నాయి.