పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏలూరులో గత శనివారం నుండి వింత వ్యాధితో జనాలు ఆసుపత్రి పాలవడంతో ఏలూరు పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. కరోనా వైరస్ కంటే దారుణంగా మూడు రోజుల వ్యవధిలోనే వందలాది కేసులు ఎందుకు వస్తున్నాయో అర్థంకాని పరిస్థితిలో ఆసుపత్రులు బాధితుల చేత నిండిపోవడంతో కొత్త వైరస్ ఏలూరులో వచ్చిందేమో అని ప్రజలంతా భయపడిపోయారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తం అయ్యి ఎందుకు మనుషులు ఊరికినే ఫిట్స్ వచ్చి పడిపోవడం వాంతులు విరోచనాలతో బాధపడటం, మూర్చా దేనికి వస్తుందో వంటి విషయాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలను రంగంలోకి దింపడం జరిగాది. ఈ క్రమంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కూడా ఏలూరు నగరానికి రావడం జరిగింది.
ఫస్ట్ మూడు రోజులు కేసులు భారీ స్థాయిలో రావడంతో సీఎం జగన్ కూడా ఏలూరు నగరానికి విచ్చేసి ప్రభుత్వాసుపత్రిలో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ వింత వ్యాధి ఏపీ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. అయితే ఈ వింత వ్యాధి రావటానికి గల సీక్రెట్ పరిశోధకులు ఛేదించినట్లు వార్తలు వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే మహమ్మారి కరోనా వ్యాపించకుండా ఎక్కువ మోతాదులో బ్లీచింగ్ అదేవిధంగా క్లోరిన్ ను బాగా వాడటం వల్ల నీరు కాలుష్యం అయినట్లు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కూడా చెప్పడం గమనార్హం. స్వయంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చెప్పినట్లే నీటి కాలుష్యం అయితే దానికి అసలు కారణం ఏమిటన్న అంశంపై ప్రభుత్వం పోకస్ చేయాలని పరిశోధన సంస్థలు సూచిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఫస్ట్ మూడు రోజులకంటే ఉన్న కొద్ది కేసులు తగ్గటంతో ఏలూరు నగరంలో కొద్దిగా ప్రశాంత వాతావరణం నెలకొంది.