ప్రజా రవాణ సర్వీసుల్లో రైలు సర్వీసులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. రైలు అతి తక్కువ ధరకే ప్రయాణం చేసే వసతి కల్పిస్తోంది. చిన్న చిన్న పట్టణాలను అనుసంధానం చేస్తూ.. ఉండే మార్గాల వల్ల కొన్ని లక్షల మంది రోజూ రైలు మార్గాలను వినియోగించుకుంటారు. ఈ రైల్లు కేవలం ప్రయాణికులకు అనువుగా ఉండటమే కాకుండా.. వేల మంది చిరు వ్యాపారులకు ఉపాధిని కల్పిస్తాయి. ఇంతలా ఎందరికో ఉపాధి, మరికొందరికి ప్రయాణ వెసులుబాటుని కల్పించే రైళ్లు కరోనా వల్ల పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో ఎందరో బతుకులు రోడ్డున పడ్డాయి.
అయితే లాక్ డౌన్ తర్వాత ఇప్పటికే అటు మెట్రో ఇప్పటికే స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడిప్పుడే అటు లోకల్ ట్రైన్స్ ఇటు ఎక్స్ ప్రెస్ లు నడిపేందుకు ఇండియన్ రైల్వే ప్రయాత్నాలు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే సాధారణంగా ట్రైన్ ప్రయాణం చేయాలనుకునేవారు ఐఆర్ సీటీసీ నుంచే తమ టికెట్లను బుక్ చేసుకుంటారు.
ఇప్పుడు ఐఆర్సీటీసీతో కలిసి ప్రభుత్వ రంగ పెద్ద బ్యాంకైన ఎస్బీఐ రూపే కార్డును తీసుకొచ్చింది. ఐఆర్సీటీసీ ఎస్బీఐ రూపే కార్డ్ పేరుతో ఉన్న ఈ కార్డును ఉపయోగించి వారు నిబంధనల మేరకు ఉచితంగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. దీంతో చెల్లింపులు వేగంగా, భద్రంగా చేయవచ్చని ఆ సంస్థలు చెబుతున్నాయి.ఈ కార్డ్ గురించి మరికొన్ని విశేషాలు..
ఈ కార్డును మార్చి 31, 2021 వరకూ ఎలాంటి ఫీ లేకుండా పొందవచ్చు. అలాగే ఐఆర్సీటీసీ వెబ్సైట్ నుంచి రైలు టికెట్లు బుక్ చేసుకునేవారు 10శాతం రివార్డు పాయింట్లు కూడా పొందే అవకాశం ఉంది. ఈ పాయింట్ల విలువ ఒక రివార్డు ఒక రూపాయికి సమానం. అలా వచ్చిన పాయింట్లను ఉపయోగించుకుని వినియోగదారులు ఉచితంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మొదటి 45 రోజుల్లో రూ.500 అంతకన్నా ఎక్కువ లావాదేవీలు జరిపిన వారికి 350 రివార్డ్స్ బోనస్ గా వస్తాయి.
ఈ కార్డును వినియోగించి ఐఆర్సీటీసీలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి చార్జీల్లో ఒక శాతం తగ్గుతుంది. అలాగే మూడు నెలలకు ఒకసారి ఉచితంగా ప్రీమియం లాంజ్ సదుపాయాన్ని అందుకోవచ్చు. అలాగే పెట్రోల్ లేదా డీజిల్పై అన్ని పెట్రోల్ బంకుల్లో 1శాతం మేరా చార్జీ మినహాయింపు ఉంటుంది. ఇవే కాకుండా మెడ్లైఫ్, ఫిట్టర్నిటీ, మీ ఎన్ మామ్స్ లాంటి వాటిలో కొనుగోళ్లను జరిపి, అదనపు ప్రయోజనాలను పొందొచ్చు. మీరు రైళ్లల్లో ఎక్కువగా ప్రయాణించేవారు అయితే.. ఒకసారి ఈ కార్డు సంగతి ఏంటో చూడండి.