టిడిపి కోవర్టులు కొందరు వైసీపీలోకి వచ్చేశారని ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి జగన్ పసిగట్టారని ,ఈ విషయంలో ఆయన చాలా సీరియస్గా ఉన్నారని అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ ని చావు దెబ్బతీయడానికి, చంద్రబాబునాయుడుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయడానికి టిడిపి నేతలు చాలామందిని పార్టీలోకి చేర్చుకున్నారు. వీరిలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉండటం తెలిసిందే. అయితే తాజా పరిణామాలలో వీరిలో చాలామంది వైసిపి లో ఉన్న టిడిపి కోవర్టులని జగన్ కి అర్థమైందట.2019 ఎన్నికల్లో ఘోర పరాభవం తదుపరి చంద్రబాబు ఒక ఎత్తుగడ వేసి నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలోకి పంపినట్లే రాష్ట్రంలో తనకు అతి సన్నిహితులైన కొందర్ని వైసీపీలోకి కూడా ప్రవేశపెట్టారని అనుమానాలు బలపడుతున్నాయి. తద్వారా వైసీపీ అంతర్గత వ్యవహారాలను సైతం తెలుసుకుని..
వాటికి కౌంటర్లు ఇవ్వడం లేదా ముందుగానే జాగ్రత్త పడడం వంటివి బాబు చేస్తున్నారని అంటున్నారు.ఇది నిజమేనన్నట్లు ఈ మధ్య కాలంలో వైసిపి పార్టీ విషయాలు లీకవుతున్నాయి.ప్రభుత్వ పరమైన అంశాలు టిడిపికి ముందే చేరిపోతున్నాయి.టిడిపి నేతలు ఇటీవల ఒక రాష్ట్ర మంత్రిపైన అవినీతి ఆరోపణలు చేయడం వెనుక వైసీపీలో కొత్తగా జరిగిన టిడిపి నేతల పాత్ర ఉందంటున్నారు.వారు కూపీలాగి ఇచ్చిన సమాచారం మేరకే టిడిపి నేతలు ఆ మంత్రిపై అవినీతి ఆరోపణలు చేశారని భావిస్తున్నారు.అలాగే ఇటీవల ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించి కూడా అత్యంత గోప్యంగా ఉంచిన సమాచారం మీడియాకు లీక్ కావడంపైనా జగన్ సీరియస్ అయినట్టు సమాచారం.కొత్తగా వైసిపిలో కొచ్చిన టిడిపి నేతలే ఈ తరహా గుఢచారి చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు.
వీరిలో కొందరు జగన్ నైజం తెలుసుకుని ఆయనకు దగ్గరగా తిరుగుతూ జేజేలు కొడుతూ కీలక విషయాలను గ్రహిస్తున్నారని తర్వాత టిడిపికి చేరవేస్తున్నారని వైసిపి నేతలు చెప్పుకుంటున్నారు.అయితే ఇప్పుడిప్పుడే జగన్ ఈ విషయాన్ని గ్రహిస్తున్నారని దీనిపైన ఆయన దృష్టి పెట్టారని వారు చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే వైసీపీ లోకి వచ్చిన టీడీపీ నేతలపై నిఘా పెట్టడంతో పాటు కొత్తగా పార్టీలోకి వచ్చే తెలుగు తమ్ముళ్లను స్క్రీన్ చేయాలని జగన్ నిర్ణయించారట.ఇకపై జగన్ దగ్గర టిడిపి కోవర్టుల పప్పులు ఉడకవంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి!