ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై బాంబే హైకోర్టు చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ఆన్ లైన్ క్లాసులు వ్యతిరేకించడాన్ని జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడమే అంటూ ఆన్ లైన్ క్లాసులని గొప్ప ప్రగతిశీల చర్యగా ఆ ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మనం ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఉన్నామని ప్రస్తుతం ఈ ప్రపంచం డిజిటల్ యుగంలో పరుగులు తీస్తుంది అని డిజిటల్ వర్చువల్ లెర్నింగ్ను అందరూ ప్రోత్సహించాలని కోర్టు తెలిపింది. దీనిని అడ్డుకోవం అంటే ప్రాథమిక విద్యాహక్కును కాలరాయడమేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ లో ఏమైనా విధాన పరమైన ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలని ఆన్ లైన్ క్లాసుల నిర్వహణలో లోపాలను సరిదిద్దాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలు తెరవాలా వద్దా అని మల్లగుల్లాలు పడుతున్నాయి.ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ పట్ల మొగ్గుచూపుతున్నాయి.ఆయితే అసలు ఎల్ కేజీ నుంచి ఆన్ లైన్ క్లాస్ లు ఏంటి అని ప్రజాసంఘాల నాయకులు విద్యా వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ లో ఈ ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై పెత్త ఎత్తున చర్చ రచ్చ జరుగుతోంది.
కొందరు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.ఈ నేపథ్యంలోనే తరగతుల నిర్వహణపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.ఇదే తరుణంలో బొంబాయి హైకోర్టు ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై ఇచ్చిన తీర్పు ఈ వ్యవహారాన్ని మనం మలుపు తిప్పేది గా ఉంది.సాధారణంగా న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను ఇతర ప్రాంతాలలో కూడా రిఫరెన్స్గా తీసుకుంటారు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఇదే మలుపు తీసుకుంటుందో చూడాలి