మీర్ పేటకు చెందిన ఓ గర్భిణీ శుక్రవారం రాత్రి కాన్పు కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. 9 నెలలు మోసి, 3 రోజులుగా పురిటి నొప్పులను అనుభవించిన కూడా తన బిడ్డను ఆమె కళ్ళారా చూడకుండానే చనిపోయాడు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వలనే ఈ సంఘటన జరిగింది
సోమవారం తెల్లవారుజామున కాన్పు చేస్తున్న సమయంలో వైద్య సిబ్బంది చేతిలో నుంచి అప్పుడే పుట్టిన శిశువు జారిపడి మృతి చెందింది. ఈ దుర్ఘటన వనస్థలిపురం ప్రాంతీయ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున 6 గంటలకు మగ శిశువు కు జన్మనిచ్చింది కాన్పు సమయంలో శిశువు ప్రమాదవశాత్తు సిబ్బంది చేతిలో నుంచి జారి కింద పడింది పడటంతో తలకు గాయమైంది. వెంటనే శిశువును చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు శిశువు అప్పటికే మృతి చెందిందని తెలిపారు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించాడని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సిబ్బంది కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.