కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎంత ప్రమాదమో మాటల్లో చెప్పడం కంటే రోజువారి జరిగే సంఘటలను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. ఆ ఒక్క క్షణంలో వచ్చే కోపానికి అవతలి వ్యక్తిని ఏమైన చేయడం లేక తను ఏమైన చేసుకోవడం వంటివి చూస్తూనే ఉన్నాం. దాంతో మళ్లీ తీసుకు రాలేని, వెల కట్టలేని నష్టాన్ని మూట కట్టుకుంటున్నాము. సమస్య ఎంతటిదైనా దానికి పరిష్కారం కోపంతో చేసే పనులు మాత్రం కాదని నేటి మనుషులు అర్థం చేసుకుంటలేరు. దాంతో వారి జీవితాన్ని లేక అవతలివారి జీవితాన్ని గుగ్గిపాలు చేస్తున్నారు.
ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. రోజూ పీకలదాకా మద్యం తాగి తల్లిని కొడుతున్నాడనే కోపంతో కన్న తండ్రిని ఇనుప రాడ్డుతో ఒక 16 ఏళ్ల యువతి బలంగా కొట్టింది. దాంతో ఆమె తండ్రి అక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో చోటు చేసుకుంది.
ఏం పని చేయని తండ్రి మేస్త్రీ అయిన కోడుకు దగ్గర రోజూ డబ్బులు తీసుకుని వాటితో మద్యం తాగి వచ్చేవాడు. మద్యం తాగిన అతను ఊరికే ఉండకుండా అతని భార్యను కొడుతూ ఉండేవాడు. ఈ విషయాన్ని చూసి చూసి విసిగిన కూతురు కోపంతో రాడ్డుతో తండ్రి తలపై కొట్టింది. అతను చనిపోయాడని తెలుసుకుని 100 నంబర్ కు కాల్ చేసి పోలీసుల ముందు లొంగిపోయింది.
పెద్దకొడుకు పెళ్లి గురించి మాట్లాడుతుండగా తండ్రి తాగి వచ్చి గొడవ చేస్తుండటంతో కోపంతో కూతురు తండ్రిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపిందని పోలీసులు తెలిపారు. ఆ బాలికపై కేసు నమోదు చేసి బాలికల సదనానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.