(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఏపిలో మహిళా ఓటర్లే ఎక్కువ. నాలుగు కోట్లకు పైగా ఉన్న ఏపి ఓటర్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 4 లక్షల 28వేల 881 మంది ఉన్నారు.
ఓటర్ల ప్రత్యేక ముసాయిదా జాబితా 2021ని ఏపి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 16 నాటికి 4 కోట్ల లక్షా45వేల 674 మంది ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారు. వీరిలో పురుషులు 1 కోటి 98 లక్షల 56 వేల 355 మంది, మహిళలు 2 కోట్ల 2లక్షల 85 వేల 236మంది. థర్డ్ జండర్ 4,083 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 15న ప్రచురించే తుది జాబితా సిద్ధంగా ఈ ముసాయిదాను వెలువరించింది.
ఈ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు, సవరణలు పంపాల్సిందిగా ఎన్నికల సంఘం ప్రజలను కోరింది. డిసెంబర్ 15వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు ఈసీ తెలిపింది.