గీత గోవిందం ఫేం పరశురాం, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందబోతున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు కెరీర్ లో రాబోయో 27 వ సినిమా. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ..14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇంతకముందు మహేష్ బాబు కి ఆగడు, బిజినెస్ మాన్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన థమన్ ఈసారి ఎవరూ ఊహించని రేంజ్ లో ఆల్బం ని సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్దిక నేరస్థుడిగా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నప్పటికి చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కాగా మహేష్ – పరశురామ్ బృందం అమెరికా డెట్రాయెట్ లో షూటింగ్ జరిపేందుకు ప్రణాళిక రచించారని అంటున్నారు. సర్కార్ వారి పాట చిత్రీకరణ కోసం ఏకంగా చార్టెడ్ విమానాన్ని ఎక్కబోతున్నారని సమాచారం. దాదాపు 20-30 రోజుల షెడ్యూల్ ప్లాన్ చాశారట.
ఇక ఈ సినిమాలో మహేష్ సరసన నటించబోయో హీరోయిన్ కీర్తి సురేష్ అని ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ ప్లేస్ లో మరో హీరోయిన్ ని తీసుకోబోతున్నారని సమాచారం.
మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరు మహేష్ సరసన కీర్తి సురేష్ ని ఫిక్సయ్యారు. ఇప్పటికే అందరికి ఒక బొమ్మ పడింది. స్క్రీన్ మీద ఈ పేయిర్ ఎలా ఉండబోతుంది అని. కాని ఇప్పుడు ఈ వార్తలు అందరిని కన్ఫ్యూజన్ అండ్ డైలమాలో పడేశాయి. మరి ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి కీర్తి డ్రాపయింది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక కీర్తి ప్లేస్ లో ఎవరు రాబోతున్నారన్నది క్లారిటీ లేదు. అసలు ఇది నిజమా కాదా అన్నది మేకర్స్ వెల్లడిస్తే గాని నమ్మడానికి లేదు.