టాలీవుడ్ ఇండస్ట్రీలో మసాలా క్యారెక్టర్లు చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో ఒకరు జ్యోతి. సినిమా కుర్రకారు గుండెలు వేడెక్కించే లా తన అందచందాలతో హీరోయిన్ జ్యోతి చాలా సినిమాలలో నటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమాలో సునీల్ భార్య గా నటించి కామెడీ తరహా పాత్రలు కూడా చేయడం జరిగింది.
కాగా తాజాగా జ్యోతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి అనేక విషయాలు చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన సినీ కెరీర్ మొత్తంలో చేసిన అతి పెద్ద తప్పు బిగ్ బాస్ హౌస్ లో కి వెళ్లడమే అని తెలిపింది. సీజన్ వన్ తెలుగు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన జ్యోతి… తక్కువ టైంలోనే ఇంటి నుండి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.
అప్పట్లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడం తెలిసిందే. ఇంటిలో ఉన్నంతకాలం జ్యోతి పర్వాలేదనిపించినా కాని పెద్దగా ఆడియన్స్ ను మెప్పించ లేకపోయింది. ఈ నేపథ్యంలో తాను హౌస్ లోకి వెళ్ళటం కెరీర్లో చేసిన అతి పెద్ద తప్పు అన్నట్టుగా జ్యోతి ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పినట్లు టాక్.అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లక ముందు ఆ షో గురించి పెద్దగా అవగాహన కూడా లేదని హీరోయిన్ జ్యోతి స్పష్టం చేసింది. యాంకరింగ్ పరంగా చూసుకుంటే నాని సిల్లీ… నాగార్జున చిల్ బ్రో… ఎన్టీఆర్ నెంబర్ వన్ అంటూ కితాబిచ్చింది.