Ys Jagan : ఉత్తరాంధ్రలో ఉద్దానం ప్రాంతంలో చాలామంది త్రాగడానికి సరైన మంచినీరు లేక కిడ్నీ సమస్యలతో బాధపడుతూ అతి తక్కువ వయస్సులోనే చనిపోయే పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
గతంలో ఈ ప్రాంతాలలో చాలా రాజకీయ పార్టీలు పర్యటించి అనేక హామీలు వాగ్దానం బాధితులకు ఇవ్వడం జరిగింది. కానీ జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చేసిన పాదయాత్రలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడ్డాక సరైన న్యాయం చేస్తానని వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది. దీంతో తాజాగా ఉద్దానం ప్రాంతంలో దాదాపు 531 కోట్ల రూపాయలతో భారీ మంచినీటి ప్రాజెక్టు కట్టడానికి జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాలకు ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు అందించేందుకు కొన్ని వందల కోట్లతో జగన్ సర్కార్ పనికి పూనుకుంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు పనులను దక్కించుకుంది మేఘా నిర్మాణ సంస్థ. అంతేకాకుండా రెండు సంవత్సరాల్లోనే పూర్తిగా పనులు కంప్లీట్ చేయనుంది. ఈ ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తయితే గనుక ఈ ప్రాజెక్టు వలన ఇచ్చాపురం, కంచిలి, కవీటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందాన మండలాలలోని 807 గ్రామాలకు నీటి సరఫరా అందనుంది. మొత్తం మీద గత పాలకుల మాదిరిగా కాకుండా ఉద్దానం బాధితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా జగన్ సర్కార్ అడుగులు వేయడంతో.. ఆ ప్రాంతంలోని ప్రజలు జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి అంటూ మరికొంతమంది పొగుడుతున్నారు.