జగన్ ప్రభుత్వం మూడున్నరేళ్లు అధికారం లో కొనసాగుతుందన్న గ్యారంటీ ఏమీ లేదని ఏపీ బీజేపీ అగ్ర నాయకుడొకరు వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది.గత శాసనసభలో బీజేపీ పక్ష నాయకుడిగా వ్యవహరించిన విష్ణుకుమార్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న గా ఉన్న విష్ణుకుమారు రాజు చలో అమలాపురం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ తన నివాసం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన వాడివేడి వ్యాఖ్యలు చేశారు.జగన్ ప్రభుత్వం మూడున్నరేళ్లు కొనసాగుతుందన్న గ్యారంటీ లేదని ప్రశ్నిస్తే గొంతునొక్కే దోరణి ఎంతో కాలం సాగదంటూ నిప్పులు కక్కారు..జగన్ నిరంకుశ పాలనను ఎదిరించి ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు మీద ఉందని చెప్పారు. అంతేకాదు… మతాలను టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా జగన్ ప్రభుత్వం ప్రవర్తిస్తోందని ఆయన దుమ్మెత్తి పోశారు.
జగన్ ప్రభుత్వం హిందువుల పట్ల వివక్ష చూపుతోందని కూడా ఆయన ఆరోపించారు .దేవాలయాల ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తే శిక్ష తప్పదని కూడా హెచ్చరించారు.హిందువుల మనోభావాలు దెబ్బతింటే పరిణామాలు చాలా అనూహ్యంగా ఉంటాయని ఆయన జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. సర్కార్ ఇకనైనా కళ్ళు తెరచి …అధికారంలో ఉన్నంత కాలం మంచిగా ఉండాలని ఆయన జగన్కు సలహా ఇచ్చారు అప్పుడే రానున్న మూడేళ్లు అధికారంలో ఉండే అవకాశం ఉంటుందని విష్ణు కృష్ణకుమార్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ధర్మ పరిరక్షణ కోసం అంతర్వేది, అమలాపురం వెళ్లిన వారిపై అక్రమ కేసులు పెట్టి జగన్ సర్కార్ చాలా పెద్ద తప్పే చేసింది అంటూ.. కావున తక్షణమే వారి తప్పును గ్రహించి పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అన్నారు. లేదంటే తమ నిరసనలు తారా స్థాయికి చేరుకుంటాయని తాము న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు.విష్ణుకుమార్ రాజు మిగతా ఊకదంపుడు ఉపన్యాసం ఎలాగున్నప్పటికీ జగన్ ప్రభుత్వం పూర్తికాలం అధికారుల్లో ఉంటదా ఉండదా అని విష్ణుకుమార్ రాజు అనుమానం వ్యక్తం చేయటమే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?