విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా న్యాయబద్ధంగా రావాల్సింది. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం “ప్రత్యేక హోదా” ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో మాట తప్పింది.
న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన “ప్రత్యేక హోదా” విషయంలో మాట తప్పటమే కాక ఇస్తామన్న స్పెషల్ ప్యాకేజీ కూడా ఇవ్వలేక పోయింది. ఇదిలా ఉండగా ప్రత్యేక హోదా విషయంలో వైయస్ జగన్ ముందు నుండి మొండిపట్టు పడుతూ, రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించే రీతిలో అనేక కార్యక్రమాలు చేపట్టి అధికారంలోకి వస్తే తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
ఇదికాక 2019 ఎన్నికలలో అధికారంలో భారీ మెజార్టీతో జగన్ వచ్చిన కేంద్రంలో బలమైన మెజార్టీతో బిజెపి ఉండటంతో పగతో కాకుండా ప్రేమతో సాధించుకునే రీతిలో ప్రస్తుతం సీఎం జగన్ ఎప్పటికప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి కేంద్రానికి గుర్తు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎవరూ ఊహించని రీతిలో వ్యవహరించడం తో…జగన్ కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి చెక్ పెట్టే రీతిలో ఆలోచన చేస్తున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అనేక విషయాలకు సంబంధించి అంతర్ రాష్ట్ర సమావేశం లో జగన్ గళం వినిపించాలని అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. ఇలాంటిది మళ్ళీ జరగకూడదు అని ప్లాన్ చేసి జగన్ కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు టాక్.