గత ఏడాది నవంబర్ నెలలో చైనా దేశంలో బయటపడిన కరోనా వైరస్ ఏడాది కాకముందే ప్రపంచంలో అన్ని దేశాలలో వ్యాపించింది. ముఖ్యంగా యూరప్ దేశాలను చిన్నాభిన్నం చేసింది. అగ్రరాజ్యం అమెరికా భారీ స్థాయిలో కరోనా కు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పరిస్థితి ఇలా ఉండగా ఇప్పటివరకూ ఈ వైరస్ కి సంబంధించి సరైన వ్యాక్సిన్ రాకపోవడం ప్రపంచ దేశాల నేతలకు కలవరం పుట్టిస్తోంది.
మరోపక్క కరోనా దెబ్బకు లాక్ డౌన్ విధించిన దేశాలు ఆర్ధికంగా నష్టపోవడం జరిగాయి. ఈ విషయం పక్కన పెడితే కరోనా బారిన పడి కోలుకున్న గాని దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు ఇప్పటికే తెలపడం జరిగింది. ఇలా ఉండగా తాజాగా కోవిడ్ బారినపడిన పురుషుల్లో అంగస్తంభన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.
కోవిడ్ బారినపడి బయటపడిన తరువాత వ్యక్తి రక్తనాళాల వ్యవస్థలో పలు సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. దీని వల్ల పురుషులలో అంగస్తంభన సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి విరుగుడు కావాలంటే సరైన వ్యాక్సిన్ రావాల్సిందే అని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కొన్ని చోట్ల స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కొత్త పాజిటివ్ కేసు లో రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తులకు పలు రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలకు జనాలు భయాందోళనలకు గురవుతున్నారు.