ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు వాడివేడిగా జరుగుతున్నాయి. టిడిపి నాయకులు కావాలని సభనుండి సస్పెండ్ చేయించుకొని బయట డ్రామాలాడుతున్నారు అని వైసీపీ అధికార పార్టీ నేతలు సభలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రోజుకో డ్రామా ఆడుతూ మీడియా ముందుకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు.
ఈ రోజు పేపర్లో చూస్తే సంకెళ్లు వేయించుకుని ఫోటోలు దిగారు. సంకెళ్ళు వేయించుకోవడం అంటే అంతా కామెడీగా సరదాగా ఉందేమో అంటూ చురకలు అంటించారు. రాష్ట్రమంతా బాగానే ఉన్నా గానీ టీడీపీ నేతలు రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించడం అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనలు తెలియజేయటం దారుణమని కన్నబాబు పేర్కొన్నారు.
ఒక ఉద్దేశపూర్వకంగా ప్రతిరోజూ ఒక డ్రామా క్రియేట్ చేసుకుని టిడిపి నేతలు వస్తున్నారని, పబ్లిసిటీ కోసం ప్రతిరోజు మార్కెట్ చేసుకునే వ్యూహం తప్ప ఏ రోజు ప్రజా సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి ఉండట్లేదని అన్నారు. అసెంబ్లీ స్టార్ట్ అయిన నాటి నుండి కొన్ని చానల్స్ లో వచ్చే స్టోరీలు కొన్ని పేపర్లలో రాస్తున్న కథనాలు చూస్తే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు టిడిపి నేతలకు అక్కసు ఎంత ఉందో బాధ ఎంత ఉందో అర్థమవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఏలాంటి కార్యక్రమాలు చేస్తోంది వంటి సబ్జెక్టుపై నేతలకు స్పష్టమైన అవగాహన ఉందని.. సభలో సబ్జెక్ట్ మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు పారిపోతున్నాయి. పైగా 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించిన ఘటన అసెంబ్లీ చరిత్రలోనే పెద్ద దుశ్చర్య గా మంత్రి కన్నబాబు అభివర్ణించారు. ఒక అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు విభజన జరిగిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలియజేయడం ఇదే ఫస్ట్ టైం అని పేర్కొన్నారు.