ఈ రోజు అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లైఫ్ గురించి ఇంకొన్ని విషయాలు…‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి సూపర్హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు అడివి శేష్.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినిమాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అడివి శేష్. అడివి శేష్ పంజా, బలుపు, రన్ రాజా రన్ సినిమాలలో ముఖ్య పాత్రలలో నటించారు. అప్పటి వరకు నటించిన సినిమాల్లో తన ప్రతిభకి మెచ్చి రాజమౌళి అడివి శేష్ కు బాహుబలి సినిమాలోని భద్ర పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర అడవి శేష్ కెరీర్ ను మలుపు తిప్పింది.
బాహుబలి తరువాత చాలా జాగ్రత్తగా కథలను ఎంచుకుంటున్నాడు అడివి శేష్. ఇంతకీ అడివి శేష్ అసలు పేరు ఏంటో తెలుసా? తన అసలు పేరు సన్నీ చంద్ర అంట. తండ్రి డాక్టర్ గా పని చేసేవారట. అడవి శేష్ పుట్టింది, పెరిగింది, తన చదువు అన్నీ కాలిఫోర్నియా లోనే. ఆయనికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టమట. సినిమాల్లోకి రాకముందు ఆయన వెబ్ డిజైనింగ్ ద్వారా డబ్బులు సంపాదించేవారట. అలా కస్టపడి సంపాదించిన మొత్తాన్ని అడివి శేష్ తమిళ సినిమా ‘కర్మ’ కోసం ఖర్చు చేశారు. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కెరీర్ ఆరంభంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి చెప్పారు. “సినిమాల కోసం అమెరికాలో మంచి ఉద్యోగంను వదిలేసి వచ్చిన నేను, అపుడు వరకు సంపాదించిన డబ్బు మొత్తాన్ని సినిమాను నిర్మించదానికి పెట్టి తప్పు చేశాను. ఆ సినిమాతోనే నా దగ్గర ఉన్న డబ్బులు అన్ని అయిపోయి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డ.
మా నాన్నకు కూడా సినిమాలంటే చాలా ఇష్టం. కాని కొన్ని కారణాల వల్ల సినిమాల్లోకి రాలేక పోయారు. నేను హీరోగా చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ గారి పంజా సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చింది. కానీ అనుకోకుండా ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో నా కెరీర్ మళ్లీ మొదటికి వచ్చింది.
పంజా తరువాత ‘కిస్’ సినిమా లో నటించా. ఆ సినిమాకు నేను పెట్టబడి కూడా పెట్టాను. చివరికి ఆ సినిమా కూడా నన్ను నిరాశ పర్చడంతో చాలా ఇబ్బంది పడ్డా. ఒకానొక సమయంలో నేను రూం రెంట్ కట్టలేకపోయా.
ఇంక ఆ సమయంలో నేను సినిమాలను ఎంపిక చేసుకోకుండా వచ్చిన ప్రతి ఒక్క ఛాన్సుని ఉపయోగించుకున్నా. ఆ సమయంలో కొన్ని సినిమాలను ఇష్టం లేకుండా కూడా చేసా కానీ డబ్బు కోసం నేను చేసిన సినిమాలు ఆడలేదు” అని అన్నారు. ప్రస్తుతం అడివి శేష్ భారత్ రియల్ హీరో మేజర్ ఉన్ని కృష్ణనన్ బయోపిక్ లో చేస్తున్నారు. మహేష్ బాబు గట్టమనేని నిర్మిస్తున్న మేజర్ సినిమా తనకు చాలా బాగా నచ్చిందని ఆ సినిమా కోసం చాలా కష్టపడినట్లు ఆయన చెబుతున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అడవి శేష్ స్పష్టం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?