బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన బిజెపి పార్టీకి దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమం పెద్ద తలనొప్పి తీసుకొస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. కొత్తగా వ్యవసాయ చట్టం తెచ్చిన బీజేపీకి దేశవ్యాప్తంగా రైతుల నుండి వ్యతిరేకత రావడంతో ఇతర పార్టీల నుండి కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్ అదేవిధంగా హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా గత కొన్ని రోజుల నుండి ఆందోళనలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలలో కర్ణాటక లో గెలిచిన గాని హర్యానా లో భారీ స్థాయిలో బిజెపికి డ్యామేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. మేయర్ స్థానం కోసం బిజెపి మరియు కొన్ని పార్టీలు కలసి కూటమిగా ఏర్పడినా గాని ఓటమి చెందడంతో వ్యవసాయ కొత్త చట్టాల ఎఫెక్ట్ బీజేపీపై భారీగానే ఉన్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం రైతులు చేస్తున్న ఆందోళనలు రాబోయే రోజుల్లో మరింత ఉధృతం అయితే దేశ వ్యాప్తంగా బీజేపీకి గడ్డుకాలం స్టార్ట్ అయినట్లే అని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. ఇలా ఉండగా త్వరలో తమిళనాడు అదేవిధంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో.. రైతుల ఆందోళనలు మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉందని, రాజకీయంగా బిజెపి అనేక ఇబ్బందులు రానున్నరోజుల్లో ఎదుర్కోవటం గ్యారెంటీ అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?