కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాని తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇందులో ఒక కీలక పాత్రలోను కనిపించబోతున్నాడు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. చెప్పాలంటే చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవి సినిమాకి మణిశర్మ సంగీతమందిస్తుండటం విశేషం. ఒకప్పుడు నాన్ స్టాప్ గా చిరంజీవి సినిమాలకి మణిశర్మ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మెగాస్టార్ కి ఒకే ఒక్క ఛాయిస్ మణిశర్మ మాత్రమే..అన్నట్టు ఉండేది ఈ ఇద్దరి మధ్య రాపో. కాని దేవీశ్రీ ప్రసాద్ ఫాంలోకి రావడం తో మణిశర్మ కి కాస్త అవకాశాలు తగ్గాయి. మళ్ళీ ఆచార్య తో కలిశారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాలో రెజీనా చిరంజీల మీద ఒక ఐటం సాంగ్ ని చిత్రీకరించారు. చిత్రీకరణ కూడా 40 శాతం పూర్తయింది. దేవదాయ శాఖలో పని చేసే ఉద్యోగిగా చిరంజీవి కనిపించబోతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆచార్య సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని నిర్మాణ సంస్థలకి కొరటాల కథ విషయంలో సలహాలిస్తూ మార్పులు చేర్పులు చెబుతున్నాడట. ఇలా కాస్త ఆర్ధికంగా కూడా కొరటాల పొందుతున్నాడు.
ఇక మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా ఒక కథ తాయారు చేయించుకున్నట్టు తెలుస్తుంది. కొరటాల మీద, ఆయన జడ్జెమెంట్ మీద నమ్మకం తోనే చరణ్ ఇలా కథ రాయించుకుంటున్నాడట. కుదిరితే ఆచార్య తర్వాత కొరటాలతోనే సినిమా చేసే అవకాశాలున్నాయని సమాచారం. అయితే ఈ మద్య చాలామంది కరోనా పాజిటివ్ అని తెలిసినా కూడా జనాలలో వచ్చి ఉంటున్నారని తోటి వారి ప్రణాలకు హాని కలిగిస్తున్నారని ఇలాంటి వారు కరోనా వైరస్ సోకిన వారికంటే అత్యంత ప్రమాదకరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొరటాల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందంటూ అందరూ అయనని సమర్ధిస్తున్నారు.