Roja: మన తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ రచయత మరియు దర్శకుడైన పరుచూరి గోపాలకృష్ణ ఇటీవల తన యూట్యూబ్ చానెల్లో రోజా గురించి మాట్లాడుతూ, ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా స్టార్గా ఎదిగిందని చెప్పారు. ఇంతకీ ఎవరా కథానాయక అనుకుంటున్నారా?
‘ప్రేమ తపస్సు’ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించగా రోజా హీరోయిన్ గా నటించింది. రోజా హీరోయిన్ గా నటించిన మొట్టమొదటి సినిమా ఇదే. ఈ సినిమా విడుదల అయిన తరువాత చాలా రోజులు ఛాన్సులు లేక ఆమె ఖాళీగా ఉంది. అప్పటికే మంచి ఫార్మ్ లో ఉన్న పరుచూరి బ్రదర్స్ , సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘సర్పయాగం’ సినిమా కోసం హీరో కి కూతురు క్యారెక్టర్ కోసం ఒక అమ్మాయిని వెతుకున్నారు. అయితే ముందుగా హీరోయిన్ మీనాను ‘సర్పయాగం’ సినిమాలో శోభన్ బాబు కూతరు పాత్ర కోసం అనుకున్నారట. కానీ అప్పటికే మీనా హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయ్యినందున మరో ఆలోచన చేస్తే మంచిది అనుకుని వేరే హీరోయిన్ కోసం వెతికారట.
ఈ సర్పయాగం సినిమాలో శోభన్ బాబు కూతురు చనిపోతుంది అందుకనే ఈ పాత్రను హీరోయిన్ మీనా చేస్తే ప్రేక్షకులు అంతగా రిసీవ్ చేసుకోరనే ఉహించడంతో కొత్త వాళ్లతో చేయించాలని రామానాయుడు తో అన్నారట. ఈ సినిమా కోసం అప్పటికే రామానాయుడు హీరోయిన్ మీనాకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. ఆ తరువాత పరుచూరి బ్రదర్స్ ప్రేమ తపస్సు సినిమ చూడగా అందులో రోజా నటనకు ఫిదా అయ్యి ఆమెకు ‘సర్పయాగం’ సినిమా లో కూతురు పాత్ర ఇచ్చారట. ఆ సినిమా విడుదల అయ్యాక సూపర్ హిట్ గా నిలవడంతో ఈ సినిమా రోజా సినీ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!