మరోసారి ప్రశాంతి కిషోర్ టీం ఆంధ్రప్రదేశ్ కి రానుందన్న వార్తలు వైసీపీలోనే కలకలం రేపుతున్నాయి.ఇంతకు ముందు పీకే టీ౦ ఎన్నికల వరకు వైసిపికి సహకరించింది కాబట్టి పెద్ద ఇబ్బంది తలెత్తలేదు.
కానీ ఈసారి ప్రభుత్వ పథకాల అమలు ప్రత్యేకించి వాలంటీర్ల వ్యవస్థ విషయంలో ప్రశాంతి కిషోర్ టీం వేలు పెట్టబోతున్న దన్న వార్త పార్టీ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది.వారి భయానికి కారణాలు లేకపోలేదు
గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నరోజుల్లో… జన్మభూమి కమిటీలను జనాలపైకి వదిలారు. పూర్తిగా ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిలా వారు ఉండాలని బాబు తలచినా కాని అది కాస్త మరోరూపం దాల్చింది! ఫలితంగా బాబు ఘోర పరాజయంలో ఇవి కూడా కీలకభూమిక పోషించాయని చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇదే రకమైన ఆలోచన జగన్ చెయబోతున్నారని కథనాలు వస్తున్నాయి.ఇందులో భాగంగానే పీకే టీం మళ్లీ రాష్ట్రంలోకి వస్తోందని సమాచారం
అదే నిజమైతే మాత్రం జగన్ కొంపముంచేవి అవే అని వైసీపీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థను ఆయనే తప్పుదోవపట్టించబోతున్నారని అంటున్నారు! వాలంటీర్లు అంటే జగన్ ప్రైవేటు సైన్యం కాదనేది గట్టిగా వినిపిస్తున్న మాట! ప్రజల సొమ్మును వారికి జీతాలుగా ఇస్తున్న తరుణంలో… వారితో పార్టీ కార్యక్రమాలు చేయించడం తగదనేది కొత్తవాదన! పికె టీం ద్వారా వాలంటీర్లను పార్టీ కార్యక్రమాలకు బాగా ఉపయోగించుకోవాలన్నది జగన్ ఆలోచనగా కనపడుతుంది అంటున్నారు
దీంతో ప్రశాంతంగా సాగిపోతున్న వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు పెరిగే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు.ఇక వాలంటీర్ల పరిస్థితి ఏమిటి? వీరిపై పెత్తనం చేయించడానికన్నట్లుగా రాబోతున్నది అని చెబుతున్న పీకే టీం ని ప్రసన్నం చేసుకోవడానికే… అధికారులు, వాలంటీర్లు పనిచేసే ప్రమాధం ఉందంటున్నారు. ఈ క్రమంలో వ్యవస్థ గాడితప్పి, జగన్ ప్రభుత్వంపై చెడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే ప్రమాధం ఉందని అంటున్నారు.
వాలంటీర్లను వాలంటీర్లుగా ఉంచి ఎన్ని పనులు చేయించుకున్నా అది జగన్ కు చాలా ప్లస్ అని… అలా కాకుండా వారు పీకే ఆధ్వర్యంలో అనధికారిక వైకాపా కార్యకర్తలుగా మారితే మాత్రం… అది మరో జన్మభూమి కమిటీలుగా మారే ప్రమాధం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జన్మభూమి కమిటీల వల్ల చంద్రబాబుకు జరిగిన నష్టాన్ని జగన్ ప్రభుత్వం అంచనా వేసి ఆ తరహా విధానాలను పాటించకపోవటమే శ్రేయస్కరమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.జగమొండి గా పేరు తెచ్చుకున్న జగన్ వింటారా అన్నదే చూడాలి!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?