Ys Jagan Mohan Reddy : పంచాయతీ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు అధికార పార్టీ వైసీపీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ టిడిపి.రాజకీయాలలో చాణిక్యుడు అనే టైటిల్ కలిగిన చంద్రబాబు.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు చాలామంది నేతలు చెప్పుకొస్తున్నారు. ఇటువంటి తరుణంలో జగన్ పంచాయతీ ఎన్నికలలో ఎలాగైనా ప్రతి జిల్లాలో ఎక్కువ ఏకగ్రీవాలు చేయాలని ఆ బాధ్యతలను స్థానిక మంత్రులకు అప్పగిస్తున్నారట. ఈ క్రమంలో జిల్లా మంత్రులకు మరియు.. అదే జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఏకగ్రీవాలు అవటం లేదని, చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సరికొత్త టాక్ వినిపిస్తోంది.
Ys Jagan Mohan Reddy జగన్ పంచాయతీ ఎన్నికలలో
రాజకీయాలలో చాణిక్యుడు అనే టైటిల్ కలిగిన చంద్రబాబు.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు చాలామంది నేతలు చెప్పుకొస్తున్నారు. ఇటువంటి తరుణంలో జగన్ పంచాయతీ ఎన్నికలలో ఎలాగైనా ప్రతి జిల్లాలో ఎక్కువ ఏకగ్రీవాలు చేయాలని ఆ బాధ్యతలను స్థానిక మంత్రులకు అప్పగిస్తున్నారట. ఈ క్రమంలో జిల్లా మంత్రులకు మరియు.. అదే జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఏకగ్రీవాలు అవటం లేదని, చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సరికొత్త టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు వైసీపీ పార్టీలో నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కి మంత్రి పెద్దారెడ్డి అదే రీతిలో ఎమ్మెల్యే రోజా మధ్య అసలు పడటం లేనట్లు, దీంతో చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు చేయటం అనేది అసాధ్యంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా చాలా జిల్లాలలో గ్రూపు తగాదాలు ఉండటంతో పంచాయితీ లో పోటీ అనివార్యమవుతునట్లు, అందరు పోటీకి దిగుతున్నట్లు, మంత్రులు.. ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్న ఎవరూ కూడా వినే పరిస్థితుల్లో లేనట్లు దీంతో జగన్ పెట్టుకున్న ఏకగ్రీవ టార్గెట్ రీచ్ అవటం అనేది కష్టమే అనే టాక్ వస్తోంది.