RAKUL PREETH SINGH: టాలీవుడ్లో డ్రగ్స్ కేసు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి అందరికీ విదితమే. అయితే, ఈ కేసులో తెలంగాణ సర్కారు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలు నవదీప్, రవితేజ, చార్మీ, పూరీ జగన్నాథ్, నందు, దగ్గుబాటి రానా, తనీష్, రకుల్ ప్రీత్ సింగ్, రవితేజ డ్రైవర్, ఓ క్లబ్ మేనేజర్కు ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. అయితే, గతంలో అనగా 2017 డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేదు. కానీ, ఈ సారి ఆమె పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరమీదకు ఎలా వచ్చిందనే చర్చ ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో జరగుతున్నది.
Taliban: అమెరికా ప్రెసిడెంట్ ఏంటి తాలిబన్లని అంత మాట అనేశాడు !!
కాగా, బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్ రకుల్ ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ క్రమంలోనే ఆమెకు సమన్లు జారీ అయ్యాయి. విచారణ కూడా జరిగింది. ఇందుకుగాను రియా చక్రవర్తితో రకుల్ జరిపిన వాట్సాప్ చాటింగ్ ఆధారంగా ఉందని సమాచారం. కాగా, అలానే ఈ సారి టాలీవుడ్ సినీ ప్రముఖులు రకుల్తో జరిపిన సంభాషణల వల్ల ఆమెకు కూడా సమన్లు జారీ కావచ్చేమోననే అంచనా.
BREAKING: సుప్రీం కోర్ట్ జడ్జిగా తెలంగాణ హైకోర్టు సీజే హిమా కోహ్లీ..!
ఈడీ విచారణ తర్వాతే డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర తేలనుంది. ఇకపోతే టాలీవుడ్లో మాత్రమే కాదు బాలీవుడ్, శాండల్వుడ్లోనూ డ్రగ్స్ వ్యవహారమై పలు కేసులు ఉన్నాయి. శాండల్వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో బెంగళూరు పోలీసులు హీరోయిన్స్ సంజన, రాగిణిను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే, ప్రస్తుతం వారు బెయిల్పై బయటకు వచ్చారు. కాగా, వారిని అరెస్టు చేసిన క్రమంలో వారి నుంచి తీసుకున్న కురుల శాంపిల్ ఆధారంగా టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రిపోర్టు కోర్టుకు సమర్పించి మళ్లీ వాళ్లను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నట్లు. ఈ నేపథ్యంలో హీరోయిన్స్ మెడ చుట్టు మళ్లీ ఉచ్చు బిగుస్తున్నదనే చెప్పొచ్చు.