ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఢిల్లీ టూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. మొదట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీ తో భేటీ అవగా తర్వాత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ చేపట్టడం జరిగింది. సరిగ్గా దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఉద్యమం తారా స్థాయిలో జరుగుతున్న సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే కాక దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
రైతు ఉద్యమానికి రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు మద్దతు కూడా తెలియజేయడం జరిగింది. ఏపీలో సంఘీభావం తెలిపిన వైసిపి పార్టీ సైలెంట్ గా ఉంటే టిఆర్ఎస్ మాత్రం రోడ్డెక్కి ఆందోళన కూడా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు.
ఇటువంటి వాతావరణంలో కేసిఆర్ ఢిల్లీ టూర్ లో ప్రధాని మోడీ తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మరికొంతమంది కేంద్ర మంత్రులతో భేటీ కావడం సంచలనంగా మారింది. ఆ తర్వాత జగన్ పర్యటన కూడా ఈ విధంగానే సాగింది. అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటన పైకి సాధారణంగా కనబడుతున్న అంతర్లీనంగా పెద్ద ఉద్దేశంతోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఢిల్లీ పెద్దలు పిలిపించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో కేంద్ర పెద్దలతో మంతనాలు జరిపినట్లు ఇరు రాష్ట్రా ప్రభుత్వ వర్గాలు చెబుతున్న ఈ పర్యటనలో ఇంకేదో దాగి ఉన్నట్లు పొలిటికల్ వర్గాలలో టాక్ వస్తోంది. పూర్తి మేటర్ లోకి వెళితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయిన సమయంలో కేంద్ర పెద్దలు జమిలి ఎన్నికల చర్చ జరిపినట్లు భావిస్తున్నారు. కేంద్రం జమిలి ఎన్నికలు తీసుకువస్తే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారా..? జమిలి ఎన్నికలకి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయా అనే చర్చ ఇప్పుడు వస్తుంది. జమిలి ఎన్నికలు మాత్రమే కాక రైతుల ఆందోళన గురించి కూడా కేంద్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంతనాలు జరిపినట్లు అభిప్రాయాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.