40 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటూ ఊహించని విధంగా తాజాగా చంద్రబాబు తీసుకున్న హిందుత్వ స్టాండ్ కి సొంత పార్టీలోనే ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. గతంలో కుల రాజకీయాలు చేస్తూ ఉన్న తరుణంలో ప్రజలు వాటిని పట్టించుకోకుండా 2019 ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పటం జరిగిందని, దీంతో ఇప్పుడు రాజకీయంగా పబ్బం గడపడానికి చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారని ప్రత్యర్థులు చెప్పుకొస్తున్నారు.
ఇలాంటి తరుణంలో తాజాగా సొంత పార్టీలోనే 37 సంవత్సరాలుగా ఉన్న మాజీ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే తాజా పరిణామాలను బట్టి పార్టీకి రాజీనామా చేయటంతో చంద్రబాబుకి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది. 2014 నుండి 2019 వరకు ఉన్న ఫిలిప్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లెటర్ రాయడం జరిగింది. ఆయన రాసినా లెటర్ ఈ విధంగా ఉంది…1983 నుండి అనగా టిడిపి పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీలో కొనసాగడం జరిగింది.
37 సంవత్సరాలుగా టీడీపీ జెండా మోస్తూనే ఉన్నాను. ఆంగ్లో ఇండియన్ క్రిస్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యేగా 2014 – 2019 ఐదేళ్లపాటు పార్టీ నన్ను నామినేట్ చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్న క్రిస్టియన్ అసోసియేషన్ లో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అందుకే ఒక బాధ్యతగల పౌరుడిగా మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. అనేక మతాలు కులాలు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఉంటారు. ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి నమ్మకాలు వారివి. ప్రస్తుతం చంద్రబాబు టిడిపి పార్టీ వైఖరి చూస్తుంటే బాధేస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు మెడలో సిలువ వేసుకుని..బైబిల్ చదువుతూ నా జన్మ ధన్యమైపోయింది అని వ్యాఖ్యానించిన వ్యక్తి.. మొన్న రాజకీయంగా ఆయన ప్రయోజనం ఆశించి రామతీర్థం సంఘటన పైన సంబంధం లేకపోయినా బైబిల్..యేసుక్రీస్తు గురించి క్రైస్తవ్యం గురించి మాట్లాడటం చూస్తే, ఇంత కాలం ఇటువంటి వ్యక్తి నాయకత్వంలో పని చేశామా అని చెప్పుకోవటానికే సిగ్గు పడుతున్నాం.
ఎక్కడైనా ఎవరైనా దేవాలయాల పైన ప్రార్ధనా స్థలాల పైన మసీదుల పైన దాడులు చేస్తే తప్పనిసరిగా ఖండించాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. గతంలో చంద్రబాబు 13 జిల్లాలు తిరిగి వారి స్థితిగతులు తెలుసుకోవాలని రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం క్రైస్తవ మతాన్ని దూషిస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మొన్నటివరకూ కులాల పేరుతో మతాల పేరుతో నేడు సమాజాన్ని విభజించాలని చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నాను. అన్ని కులాల వారు అన్ని మతాల వారు వేసిన ఓట్లతో టిడిపి అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని గుర్తు చేస్తున్నాను. రామతీర్థం కి గాని దేవాలయాలకు ఎటువంటి సంబంధము క్రిస్టియానిటీ లేకున్నా రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న వైఖరి నచ్చక.. పార్టీని వీడుతున్నట్లు రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. దీంతో 37 సంవత్సరాలుగా పార్టీ స్థాపించిన నాటి నుండి ఉన్న వ్యక్తి పార్టీ నుండి వెళ్లిపోవడంతో టీడీపీ పార్టీలో మాత్రమేగాక ఏపీ రాజకీయాల్లో ఎక్స్ ఎమ్మెల్యే ఆంగ్లో-ఇండియన్ రాసిన లెటర్ పెద్ద హాట్ టాపిక్ అయింది.