Kanakadhara stotram: లక్ష్మీదేవి అంటే అదృష్టానికి, శుభానికి గుర్తు అని భావిస్తుంటారు. ఎవరు ఎటువంటి రంగంలో ఉన్నా సరే వారి అభివృద్ధి జరిగే విధంగా ఆది గురువు శ్రీ ఆదిశంకరాచార్యులవారు ‘కనకధారా స్తోత్రం’ చెప్పడం జరిగింది. ఈ కనకధారా స్తోత్రాన్ని రోజు కి రెండు సార్లు చదివితే నిరుపేదలైనా సరే కుబేరులవుతారు. అటువంటి కనకధారా స్తోత్రం ( kanakadhara Stotram )చదవాలి అని అనుకున్నవారు వారు కొన్ని సూచనలను కచ్చితం గా అనుసరించాలి.
కనకధారా స్తోత్రాన్ని పఠించాలి అని అనుకున్నప్పుడు ఉత్తర ముఖంగా కూర్చుని చదవాలి.మహాలక్ష్మీదేవి పటాన్ని లేదా మహాలక్ష్మీ యంత్రాని కి కానీ ఎదురుగా కూర్చుని పారాయణ చేయాలి అలాగే ప్రతి రోజూ ఉదయం 6:00 గంటల నుండి 7:00 గంటల మధ్య, కాలం లో అదే విధం గా సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల మధ్య పారాయణ చేయడం ఉత్తమం గా చెప్పబడింది. కనకధారా స్తోత్రాన్ని పౌర్ణమి రోజున ఉపదేశం పొందే విధం గా చూసుకోవాలి.
కనకధారా స్తోత్ర పారాయణ చేయడానికి వయసు లింగ భేదాలు అనేవి లేవు.ఎట్టి పరిస్థితిలో కూడా పూజ చేసే సమయం లో నలుపు రంగు , ఎరుపు రంగు వస్త్రాలను వేసుకుని పూజించకూడదు
పట్టువస్త్రం కట్టుకోవాలి లేదా ఎరుపు, నలుపు లేని బట్టలను కట్టుకుని శ్రీ కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేసి ఆతరువాత కులదేవతకు పూజ చేస్తే ఋణ బాధలు తొలగి.. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది.
పురుషులు నిత్యం శ్రీ కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన అప్పులపాలు అవడం అనేదే ఉండదు. కాబట్టి ఈ నియమాలు కచ్చితం గా అనుసరించడం మంచిది.