దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కెరీర్ లో ఒక సినిమా గురించి ఇన్ని రకాల గాసిప్స్ రావడం బహుషా ఇదే మొదటిసారి కావచ్చు. ఆయన ఏ సినిమా మొదలు పెట్టినా కాస్త టైం ఎక్కువ తీసుకుంటాడేమోగా గాని దాదాపు ముందు చెప్పిన టైం కే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు. కాని బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా రౌద్రం రణం రుథిరం మాత్రం అంతకంతకి ఆలస్యం అవుతూనే ఉంది.
దానికి తోడు చరణ్ వీడియో టీజర్ రిలీజైనప్పటి నుంచి తారక్ వీడియో టీజర్ రిలీజ్ చేయమని నందమూరి అభిమానుల ఒత్తిడి ఒకటి. కాని వీటన్నిటికి కరోనా చాలా దెబ్బ కొడుతుంది. ఇప్పటికే రాజమౌళి చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఎలాగైనా ఆర్ ఆర్ ఆర్ ఊహించని సక్సస్ అందుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని అన్నీ అవాంతరాలే. ఈ విషయంలో రాజమౌళి మొండి ధైర్యంతో ఉన్నప్పటికి కొన్ని సార్లు తప్పని పరిస్థితుల్లో ఇరుక్కొని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, ఓలియా మోరిస్..ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో శ్రియ నటిస్తున్న విషయాన్ని గోప్యంగా ఉంచారు రాజమౌళి. కాని శ్రియ అత్యుత్సాహం వల్ల పుసుక్కున రివీలైపోయింది. అది కూడా స్వయంగా శ్రియ రివీల్ చేసి రాజమౌళి ని టెన్షన్ లో పడేసింది. కాగా తాజాగా మరోసారి ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుందని ఆర్ ఆర్ ఆర్ గురించి … రాజమౌళి గురించి ఓ రేంజ్ లో హైప్ క్రియోట్ చేసింది శ్రియ. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ అంచనాలు ప్రేక్షకుల్లో భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు శ్రియా వ్యాఖ్యలతో మరింతగా బజ్ క్రియేటయింది. ఇది ఒకరకంగా రాజమౌళి ని ఇబ్బంది పెట్టే అంశమే అని చెప్పుకుంటున్నారు.