కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో చాలా కంపనీలు వారి స్టాప్ ని తగ్గించిన సంగతి తెలిసిందే. అలాగే ఉన్నా కొద్ది మంది ఎప్లాయిస్ ను కూడా ఇంటి నుంచే పని చేయమని చెప్పిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ తో వర్క్ ప్రమ్ హోమ్ చేస్తున్న వారిని ఇప్పుడు ఆఫీస్ కు రప్పించే పనిలో పలు కంపనీలు పడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు ఒక్కరోజైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంత అడిగినా ఇవ్వని కంపనీలు.. ఇప్పుడు వారానికోసారి ‘ఆఫీస్’కు వస్తే చాలు అంటున్నాయంటే అర్థం చేసుకోవాలి కరోనా వైరస్ కార్పొరేట్ కంపెనీలను ఎలా మార్చిందనేది.
కంపనీలకు ఎంప్లాయిస్ ను ఆఫీసులకు పక్కా రావాలని చాలా కంపనీలు ఇప్పటికే సూచనలు చేశాయి. అయితే హెచ్ సీ ఎల్ మాత్రం వారానికోసారైన రండి అని వాళ్ల ఎంప్లాయిస్ కు సూచిస్తోంది. కరోనా ఆంక్షలను పాటిస్తూ ఆఫీస్ ను అందుకు అనుగుణంగా మారుస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పుటికే 5 నుంచి 6 శాతం మంది ఎంప్లాయిస్ తో మాత్రమే ఆఫీస్ వ్యవహారాలు నడుపుతోంది. డిసెంబర్ నాటికి ఈ సంఖ్యను 20%కి పెంచాలనే యోచనలో కంపనీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఆఫీస్ కు వచ్చే వారికి తగిన ఏర్పాటు చేసినట్లు ఆ కంపనీ సీహెచ్ ఆర్ వో అప్పారావ్ వీవీ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సోషల్ డిస్టెన్స్ తో ఆఫీస్ లో తగిన ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఎంప్లాయిస్ కు క్యాబ్ వసతి కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆఫీస్ కు వచ్చి పని చేసే ఎంప్లాయిస్ కూర్చునే చైర్ల మధ్య దూరం మూడు ఫీట్లు ఉండేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే వారానికోసారి ఆఫీస్ కు రావాలన్న నిబంధన అందరికి కాదని తెలిపారు. 5 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నావారు, 50 ఏళ్లకు పైబడిన వయసున్న తల్లిదండ్రులు ఉన్నవారు ఆఫీసుకు రానవసరం లేదని సీహెచ్ ఆర్ వో ఇంటర్వ్యూలో తెలిపారు.