New Couple: భోజనం చేసే సందర్భం లో
కొత్త దంపతులు కలిసి మొదట సారి భోజనం చేసే సందర్భం లో ఆ ప్రదేశం లో తీగలతో కూడిన లతలు, పువ్వుల ముగ్గులు వేయాలి.
దేవతా రూపాలను, ఓం కారం , స్వస్తిక్ చిహ్నం , శ్రీ గుర్తులను పోలినటువంటి ముగ్గులు మాత్రం అస్సలు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని ఎట్టి పరిస్థితులలో తొక్కకూడదు.గుడిలో అమ్మవారు, శ్రీ మహావిష్ణు ముందు ప్రతి రోజు ముగ్గులు వేసే స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం లేకుండా సుమంగళిగానే ఉంటుంది అని మన పురాణాలూ చెబుతున్నాయి.
New Couple: బియ్యపుపిండితో
ఏ రోజుకారోజు కడిగి శుభ్రం చేసి బియ్యపుపిండితో మాత్రమే ముగ్గు పెట్టాలి.ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ప్రతి రోజు ముగ్గు వేస్తుండాలి. ముగ్గు పాజిటివ్ శక్తిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది.ఇంటి ముందు వేసిన ముగ్గులు ఒకప్పుడు ఆ ఇంటి పరిస్థితిని తెలియచేసేవి. ఇంటి ముందు ముగ్గు వేసి లేదంటే ఎవరో మరణించారు అని గుర్తించేవారు.ఇది వరకు రోజూలలలో బ్రహ్మచారులు,సాధువులు, సన్యాసులు, ఇంటింటికి తిరిగి బిక్ష తీసుకునేవారు.
మిట్ట మధ్యాహ్నవేళా
ఇంటి ముందు ముగ్గు వేసి లేకపోతే, ఆ ఇంటి ముందు ఆగేవారు కాదు. చనిపోయిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజు వరకు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ చేసిన వెంటనే అది మిట్ట మధ్యాహ్నవేళా అయినా కూడా ఇంటి ముందు ముగ్గు పెడతారు. మనకు ఉన్న ఆచారాలలో ఏది మూఢనమ్మకం కాదు. వాటి వెనుక ఎన్నో అర్ధాలు ,పరమార్ధాలు దాగి ఉన్నాయి.