పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు చేస్తూ మరోపక్క సినిమా రంగంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. 2018 అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాల్లో రాణించిన పవన్, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన మళ్లీ ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా రాజకీయాలు కూడా చేస్తూ ఎక్కువ శాతం సొంత పార్టీ జనసేన నీ ఆర్థికంగా పైకి తీసుకురావడానికి..పవన్ వరుసపెట్టి సినిమా ప్రాజెక్టులను ఒప్పుకుంటున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో వకీల్ సాబ్ సినిమా ఒప్పుకొని కొద్ది నెలలలో షూటింగ్ కంప్లీట్ చేయగా మహమ్మారి కరోన రావటంతో ఆ సినిమా విడుదల వాయిదా పడటం అందరికి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతున్న ఇదే తరుణంలో హరీష్ శంకర్, క్రిష్ డైరెక్టర్ లతో పాటు మరి కొంత మంది డైరెక్టర్ల కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది.
ఇదిలా ఉండగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలు చేసి పవన్ అభిమానులను ఎంతగానో అలరించాడు డైరెక్టర్ పూరి. అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ కోసం ఓ పొలిటికల్ స్టోరీతో సినిమా చేయడానికి పూరి రెడీ అయినట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వినబడుతుంది. అవినీతితో కూడిన సమాజంలో అంతమొందించే రీతిలో పొలిటికల్ లీడర్ గా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంత మాత్రమే కాక పవన్ ఓకే అని అధికారిక ప్రకటన వచ్చిన అనంతరం..కేవలం కొద్ది నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో పూరి ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!