దుబ్బాక లో నవంబర్ మూడవ తారీకున ఉప ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా గతంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల విషయంలో ఎప్పుడు భయపడని కేసిఆర్ ఈ ఎన్నికల విషయంలో తెగ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ ఉప ఎన్నికల బాధ్యతను మేనల్లుడు హరీష్ రావుకి అప్పగించినట్లు సమాచారం.
పూర్తి విషయంలోకి వెళితే కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైన ట్లు ప్రజలు భావిస్తున్నట్లు అంతర్గతంగా తేలిందట. అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కూడా పెద్దగా జరగలేదని అంటున్నారట. ముఖ్యంగా గతంలో చాలా సార్లు ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ఒరిగిందేమీ లేదని భావిస్తున్నారట.
ఇదే తరుణంలో విపక్షాలు కూడా ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి అని అడుగుతున్నారు. దీంతో ఈ విషయం హరీష్ రావు కి తెలియటంతో ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల ప్రస్తావన తీసుకు వస్తూ ఇతర పార్టీ కి ఓట్లు వేస్తే ఒరిగేదేమీ ఉండదని పైగా పైన ఉన్నది టిఆర్ఎస్ పార్టీ, కాబట్టి మీరే ఆలోచించుకోవాలి అన్నట్లుగా అభద్రతా భావంతో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే దుబ్బాక ఉప ఎన్నికలు హరీష్ ని బాగా టెన్షన్ పెట్టిస్తున్నట్లు టాక్.