గత ఏడాది నవంబర్ మాసంలో చైనా లో బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. మహమ్మారి వైరస్ దెబ్బకి ప్రపంచ దేశాల ఆర్ధిక పరిస్థితి తలకిందులు అయిపోయాయి. ఇటువంటి తరుణంలో వైరస్ కి విరుగుడు వ్యాక్సిన్లు వస్తున్న సమయంలో బ్రిటన్ దేశంలో కరోనా స్ట్రెయిన్ అంటూ రెండో రకం వైరస్ బయటపడినట్లు వార్త ఇప్పుడు ప్రపంచ దేశాలకి నిద్ర లేకుండా చేస్తుంది.
కరోనా స్ట్రెయిన్ గత వైరాస్ ల కంటే 70 శాతం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ దేశాలు విమాన రాకపోకలు అన్ని దేశాలు క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండో రకం కరోనా అంటేనే హడలెత్తి పోతున్న సమయంలో ప్రపంచానికి మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అదేమిటంటే బ్రిటన్ లో మరో కొత్త వేరియంట్ ని కొనుక్కున్నారు.
సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికీ మూడో రకం కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇది మొదటి రెండు రకాల కంటే మరింత వేగంగా విస్తరించే గుణం కలిగి ఉందని అధికారులు గుర్తించారు. దీంతో యూరప్ దేశాలు దక్షిణాఫ్రికా సరిహద్దులను క్లోజ్ చేసేశాయి. మాత్రమే కాక దక్షిణ ఆఫ్రికా దేశం నుండి వచ్చిన ప్రతీ ప్రయాణికులను నిర్బంధంలో ఉంచాలని యూరప్ దేశాలు తమ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.