టిడిపి మాజీ మంత్రి అఖిల ప్రియ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఐదారు నెలలు జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
తర్వాత ఆమె ఒక్కసారిగా స్లో అయారు.దీనితో వైసీపీలోకి వెళతారన్న ఊహాగానాలు కూడా సాగాయి.అయితే ఆమె వెంటనే ఖండించారు.కానీ అనూహ్యంగా ఆమె సైలెంట్ అయ్యారు. ఎక్కడా దాదాపు రెండు మాసాలుగా అఖిల ప్రియ వార్తలు రావడం లేదు. ఆమె మీడియా ముందుకే రావడం మానేశారు. దీంతో అసలు ఏమైంది? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.దీనికి ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు పరిశీలకులు. ఒకటి.. సొంత పార్టీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో అఖిల ప్రియ భర్తపై కేసునమోదైంది. రెండు ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత చంద్రబాబు చూసీ చూడనట్టు వ్యవహరించారు. దీంతో అఖిల ప్రియ మౌనమే మంచిదని భావిస్తున్నారని చెబుతున్నారు.
తన భర్తపై కేసు నమోదైన నేపథ్యంలో అధికార పార్టీపై విమర్శలు చేస్తే.. ఇది మరింతగా తన కుటుంబానికి ఇబ్బందికర పరిస్థితిని తెస్తుందని అందుకే అఖిల ప్రియ సైలెంట్ అయ్యారని కర్నూలు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అన్నింటికీ మించి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన విషయంలో పెద్దగా స్పందించకపోవడాని అఖిలప్రియ జీర్ణించుకోలేకునారట.మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ,మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి అరెస్టు అయినప్పుడు తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన చంద్రబాబు గానీ టిడిపి గానీ తన భర్తపై కేసు నమోదైనప్పుడు మౌనం పాటించడాన్ని అఖిల ప్రియ పరిగణనలోకి తీసుకుని తన సొంత రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోందని ఆ వర్గాలు చెబుతున్నాయి .
ఒక మహిళగా ఉండి కూడా కర్నూలు జిల్లాలో సంక్లిష్టమైన ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గ రాజకీయాలను లాక్కొస్తున్నా పార్టీ అధిష్టానం తమను పట్టించుకోకపోవడం ఆమెను తీవ్రంగా బాధించిందని తెలుస్తోంది. మొత్తం మీద అఖిల ప్రియ ఆలోచనా ధోరణిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆమె ఈరోజు రేపు ఏదో ఒక బాంబు పేల్చవచ్చునని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు