టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి..! ఇప్పటివరకు మనం క్యామోప్లేజ్ తో ఉన్న వాహనాలను చూశాం.. మొదటి సారిగా ఎలాంటి క్యామోప్లేజ్ లేకుండా టాటా గ్రావిటీస్ ఎస్యూవి ను పరిచయం చేసేందుకు భారత రోడ్లపై విస్తృతంగా టెస్ట్ చేస్తుంది.. మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.. పూర్తి వివరాలు ఇలా..
2020లో జరిగిన ఆటో ఎక్స్పోలో టాటా మోటార్స్ తొలిసారిగా తన గ్రావిటీస్ ఎస్యూవీని ప్రపంచానికి పరిచయం చేసింది.. అప్పటి నుండి ఈ మోడల్ పై భారీ డిమాండ్ ఏర్పడింది.. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న హరియర్ ఎస్యూవీని ఆధారంగా చేసుకుని కంపెనీ ఇందులో గ్రావిటీస్ పేరిట ఓ కొత్త 7-సీటర్ అభివృద్ధి చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే.. అయితే దీనిని ఎటువంటి క్యామోప్లేజ్ లేకుండా టాటా గ్రావిటీస్ ఎస్యూవి ను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు మోడల్స్ లో తేడా తెలిపేందుకు గ్రావిటీ ఫ్రెంట్ అండ్ రియర్ డిజైన్లో మార్పులు చేసింది.
ఫీచర్స్ :
ఇది హరియర్ కంటే 63mm ఎక్కువ పొడవు , 80mm ఎత్తును కలిగి ఉంటుంది. అందువలన ఇందులో క్యాబిన్ స్పేస్ ఎక్కువగా ఉండటంతో హెడ్ రూమ్, లెగ్ రూమ్ మరింత విశాలంగా ఉంటుంది. ఈ రెందింటిలో వీల్బేస్ ఒకేలా 2741 మిల్లీమీటర్ ఉంటుంది. స్ప్లిట్ హెడ్ ల్యంప్స్ సెట్అప్ తో, టైయిల్ ల్యంప్స్ డిజైన్, ఇతర ఫిచర్లను అందిస్తుంది. దీనిని త్రీ రో సిటింగ్ కాన్ఫిగరేషన్ తో విభిన్నమైన సిటింగ్ లేఅవుట్ లతో అందుబాటులోకి రానుంది. దీని ఇంజన్, ట్రాన్సిమిషన్ ఆప్షన్లు కూడా వేరువేరుగా ఉన్నాయి. బిఎస్6 కంప్లైంట్ 2.0లీటర్, ఫోర్ సిలిండర్ క్రయోటిక్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్పి పవర్ను 350 ఎన్ ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్, స్టాండ్ర్డ్, మాన్యూవల్ గేర్ బాక్స్ లలో లభిస్తుంది. ఇది టయోటా ఫార్చునర్, మహీంద్రా ఆల్యూటిరాస్ జి4, ఫోర్డ్ ఎండీవర్, ఎంజి యాక్టర్ ప్లస్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా నిలవనుంది.