కరోనా కారణంగా సినిమా థియేటర్స్.. మల్టీప్లెక్సెస్ దాదపు 6-7 నెలలుగా మూతబడే ఉన్నాయి. ప్రభుత్వాలు షూటింగులకు అనుమతులిచ్చినప్పటికీ థియేటర్స్ రీ ఓపెనింగ్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లలో సినిమాలని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అంతకముందు ఎంత లేటయినా మా సినిమాని థియేటర్లలోనే రిలీజ్ చేస్తాము అని చెప్పుకొచ్చారు. కాని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా థియోటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియకపోవడంతో ఒక్కో సినిమాకి మంచి డీల్ కుదిరితే ఓటీటీలో రిలీజ్ కి సిద్దమవుతున్నారు.
ఇప్పటికే గడిచిన ఈ ఆరు నెలల్లో వివిధ భాషల నుంచి పలు సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదలయ్యాయి. హిందీలో ‘గులాబో సితాబో’ ‘దిల్ బేచారా’ ‘లూట్ కేస్’ ‘యారా’ ‘సడక్ 2’ ‘గుంజన్ సక్సేనా : కార్గిల్ గర్ల్’ ‘శకుంతలాదేవి’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే మళయాలంలో ‘సూపియుమ్ సుజాతయుమ్’ ‘సీ యూ సూన్’.. కన్నడలో ‘లా’ మరియు ‘ఫ్రెంచ్ బిర్యానీ’ సినిమాలు.. తెలుగులో దాదాపు అన్నీ చిన్న సినిమాలే విడుదలవగా రీసెంట్ నా నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి’ సినిమా రిలీజ్ అయింది. అయితే వీటిలో ఒక్క భారీ బడ్జెట్ తో నిర్మించిన.. అలాగే పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా మాత్రం లేదన్న టాక్ వినిపించింది.
ఇక ఇప్పటి వరకు రిలీజైన సినిమాలలో ‘దిల్ బేచారా’ కి మాత్రమే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఒక భారీ మాస్ హీరో సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
కాగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకంటే కూడా భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కి ఓటీటీలో రాబోతున్న సినిమా బాలీవుడ్ స్టార్ హీరో నటించిన ‘లక్ష్మీ బాంబ్’. ప్రముఖ కొరియో గ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటించింది. ఇక ‘లక్ష్మీబాంబ్’ సినిమాని దీపావళి కానుకగా నవంబర్ 9న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళ్, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయిన హార్రర్ కామెడీ ‘కాంచన’ కు రీమేక్ తెరకెక్కిన ‘లక్ష్మీబాంబ్’ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంటో చూడాలి.