Temple : కొన్ని నిమిషాలు బతికించే
చనిపోయినవారిని కొన్ని నిమిషాలు బతికించే దేవాలయం ( Temple) భారత దేశంలో చనిపోయిన వారిని తిరిగి బతికించగలిగే శక్తి ఉన్న దేవాలయం ఉంది అన్న విషయం పచ్చి నిజం. భారత దేశంలో ఉన్న ఎన్నో అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో లఖ్ మండల్( lak mandal ) దేవాలయం కూడా ఉంది.ఇక్కడ అతి ముఖ్యమైన ఆకర్షణ స్వామి వారి లింగం. అత్యంత పారదర్శకత కలిగిన లింగం ఇది .శివాలయం చుట్టుపక్కల ఉన్న పచ్చదనం అంతా అ లింగం పై భాగంలో మనకు కనిపిస్తుంటుంది. పరమశివుడు నిత్యం ఇక్కడే కొలువై ఉంటాడు అని స్థానికులు గట్టిగా నమ్ముతారు.
Temple : దురదృష్టం పోయి
ఈ దేవాలయాన్నిదర్శించడం వల్ల దురదృష్టం పోయి అదుష్టం కలుగుతుంది అని చెబుతారు.ఇక ఈ దేవాలయం ప్రవేశ ద్వారందగ్గర మానవ, దానవ అనే రెండు ఎత్తైన విగ్రహాలు మనకు కనిపిస్తాయి. అయితే స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఈ రెండు విగ్రహాల్లో ఒకటి భీమసేనుడు, రెండో విగ్రహం అర్జునుడిదని వారు నమ్ముతారట.మానవ, దానవ అనే ప్రతిమలను విష్ణువు నివశించే వైకుంఠ ద్వారపాలకులైన జయ విజేయులతో కొందరు పోల్చుకుంటారట. ఎవరైనా ఆఖరి ఘడియల్లో ఉన్నప్పుడు లేదా చనిపోయిన వెంటనే ఈ రెండు విగ్రహాల ముందుకు తీసుకువస్తారు. సాక్షాత్తు పరమ శివుడి స్వరూపమైన ఆ శివలింగాన్ని అభిషేకించి ఆ నీటిని చివరి ఘడియల్లో ఉన్న వారికి లేదా చనిపోయిన వ్యక్తి నోట్లో పోయడం వలన తిరిగి కొద్ది సేపు బతుకుతారు అని ఇక్కడి స్థానికులు దృఢం గా నమ్ముతారు.ఇందుకు సంబందించిన ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు కూడా చూపిస్తారు.
లింగంపై స్పష్టంగా
దేవతలునివాస రాష్ట్రంగా పిలిచే ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ జిల్లాలో చౌన్సర్ – బావర్ అనే ప్రాంతం లో ఈ గుడి దర్శనమిస్తుంది .
ఉత్తర భారత దేశ పద్దతిలో ఈ దేవాలయాన్ని కట్టడం జరిగింది.చక్రతా నుంచి ఇంచు మించు 100 కిలోమీటర్ల దూరంలో లఖ్ మండల్ దేవాలయం ఉంటుంది.ఈ మెరిసే శివలింగం పై నీరుపోస్తే అద్దంలా మెరుస్తూ అద్భుతంగా కనిపించడం తో పాటు పోసినవారి బింబం లింగంపై స్పష్టంగా కనబడుతుంది. అభిషేకం చేసిన నీరు కూడా స్వఛ్చంగా, రుచి కి తియ్యగా మారడం ఈ లింగం యొక్క మహాద్భుతం. అవకాశం ఉంటే కచ్చితం గా వెళ్లి దర్శనం చేసుకోండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?