Narasimhaswamy: అందమైన అడవుల్లో
దేశంలో అనేక చోట్ల మనకు నరసింహ స్వామి (Narasimhaswamy ) గుళ్ళు కనిపిస్తాయి. ఆ గుళ్ళు అన్ని చాలా వరకూ కొండల్లో గుట్టల పైన దర్శనమిస్తాయి. ముఖ్యంగా నరసింహుడి దేవాలయాలన్నీ చాల వరకూ గుహాలయాలే.మనం ఇప్పడు తెలుసుకోబోయే ఆలయం మాత్రం అందమైన అడవుల్లో ఉంది . ఈ విగ్రహం రూపు దగ్గర నుంచి ఎన్నో విషయాలలో ప్రత్యేకతను కలిగి ఉంటుంది.మెత్తటి చర్మం ఉన్న విగ్రహం రూపంలో వెలిసిన వాడే హేమాలచల నరసింహ స్వామి. చాలా చోట్ల నరసింహ స్వామి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. ఇక్కడ మాత్రం నరసింహ స్వామి మాత్రమే స్వయం భువుగా నల్లని విగ్రహంలో దర్శనం కలిగిస్తారు.
Narasimhaswamy: నాభి లో నుండి
ఈ దేవాలయం వయసు సుమారుగా 4,796 సంవత్సరములు. స్వామి విగ్రహం 9 అడుగులుల వరకు ఉంటుంది.
స్వామివారి పాదాల దగ్గర నుండి చింతామణి అనే ధార పడుతూ ఉంటుంది. ఈ నీరు సర్వరోగ నివారిణి అని నమ్ముతారు. విదేశాల్లో ఉన్న వారికి కూడ ఇక్కడ ఉన్నవారు ఆ నీటిని పంపుతుంటారు. అన్ని ప్రాంతాలలో శిల రూపంలో దర్శనం ఇస్తుంటే ఇక్కడ శిలాజిత్తు రూపంలో దర్శనమిస్తారు. అంటే శిలను తాకితే చర్మం ఉన్నట్లు మొత్తగా అనిపిస్తుంది . నుదిటి నుంచి పాదం వరకూ ఏ ప్రాంతం లో తాకినా సొట్ట పడి మరలా యథాస్థితికి వచ్చేస్తుంది. స్వామికి అభిషేకం జరుగుతున్నపుడు స్వామి వారి విగ్రహం నుంచి రోమాలు రాలుతున్న అనుభూతి కలుగుతుందని ఇక్కడి పూజారులు వివరిస్తున్నారు. స్వామి వారి నాభి లో నుండి ఎప్పుడు స్రవాలు వస్తుంటాయి . దాన్ని స్వామి వారి స్వేదం గా భావిస్తారు. ఈ స్వేదం అలా కారి పోకుండా ఉండడానికి అక్కడ చందనాన్ని పెడుతుంటారు. ప్రతి శనివారం , ఆది వారం , సోమవారాల్లో ఈ చందనాన్ని భక్తులకు ఇస్తుంటారు. ఈ చందనం ప్రసాదంగా భావించి తీసుకుంటే సంతానలేమి సమస్యలు తొలగుతాయి అని భక్తులు నమ్ముతారు.
స్వామి వారి మహత్యంగా
ఇక్కడి విగ్రహం వేసవి కాలం లో ఒక లాగా, మిగిలిన కాలాల్లో ఒకలాగా ఉంటుంది.. దీనిని స్వామి వారి మహత్యంగా భావిస్తుంటారు.
తెలంగాణ రాష్ట్రం లోని జై శంకర్ భూపాల్ జిల్లాలోని , మంగపేట మండలం లో ఉన్న , మల్లూరు గ్రామానికి దగ్గర హేమచల నరసింహుడు గా స్వామి కొలువై ఉన్నాడు. పచ్చని అడవుల్లో ప్రశాంత వాతావరణంలో ఈ ప్రయాణం సాగుతుంది. ఈ ప్రాంతాన్ని మల్లూరు గుట్ట అని అక్కడ అందరు పిలుస్తుంటారు.