Gents: రాత్రంతా పడుకుని
మన సాంప్రదాయంలో ముగ్గుకున్న ప్రాముఖ్యత చాలా గొప్పది. ప్రతి రోజు ఆడవారు ఉదయం ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేయమని చెప్పడానికి వెనుక చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. నడుము భాగానికి సరైన వ్యాయామం లేకపోతే రాను రాను అనేక వెన్ను సమస్యలకు కారణం అవుతుంది. రాత్రంతా పడుకుని ఉండడం వలన వెన్ను నిటారుగా ఉంటుంది కాబట్టి ఉదయం లేవగానే నడుముకు సంబంధించిన వ్యాయామం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది అని మన పెద్దలు ఈ ప్రక్రియ మొదలు పెట్టారు
Gents: వెన్నుపూసకు
ఉదయం నడుముకు సంబంధించిన వ్యాయామాల లో భాగమే ఆడవారు ముగ్గు వేయడం. ముగ్గులు వేయాలంటే నడుమువంచి , చుక్కలు పెట్టి వాటిని కలవడానికి అటు, ఇటు చేతులు, నడుము కద పవలిసి ఉంటుంది. ఈ విధంగా నడుముకు సంబంధించిన వ్యాయామం చేసినట్లు అవుతుంది. దీని వలన నడుము నొప్పులు రావు. అందుకే ఉదయం ముగ్గులు వేయడం అనేది మన సంప్రదాయంలో ముఖ్య భాగంగా చేయబడింది. దానితో పాటు వంగి నప్పుడల్లా శ్వాస నిదానంగా తీసుకుంటూ ఉండడం ఒక విధమైన ప్రాణాయామం అనే చెప్పాలి. పిల్లలు పొద్దున స్కూల్ కి వెళ్తే, ఏ రాత్రో ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో సౌకర్యాలు అన్ని ఉండడం వల్ల అసలు నడుము వంచి పని చేసే అవకాశం లేదు. ఈ పరిస్థితి వల్ల ముందు ముందు వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు రావడానికి కారణం అవుతుంది. కానీ మనం ఇప్పుడు పెయింట్ ముగ్గు పెట్టేసి సరిపెట్టేసుకుంటున్నాం.
ఆడవారికి క్రియేటివిటీ
ముగ్గు ఆడవారే వేయాలి అన్నది ఏమీ లేదు. ఎందుకంటే గర్భగుడిలో దేవుని దగ్గరకు పూజారి మాత్రమే వెళ్తారు. అక్కడ శుభరపరిచి, ఆయనే ముగ్గు వేస్తారు. అలాగే సూర్య భగవానుడికి చేసే పూజల లో ఇతర దేవతా పూజల్లోనూ కొన్ని రకాల యంత్రాలను వేస్తుంటారు. అప్పుడు కూడా వాటిని ఉపాసకులే వేస్తారు. ఆడవారికి క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. వారి టాలెంట్ ను బయటకు తెలియజేసేదే ముగ్గు.