కరోనా వల్ల సినిమా షూటింగ్లకు లాంగ్ బ్రేక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో చిన్న సినిమాలతో పాటుగా పెద్ద సినిమాలు కూడా చిత్రీకరణ జరుపుకోవడానికి సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్.. ఆచార్య.. రాధే శ్యాం లాంటి పాన్ ఇండియన్ సినిమాలన్ని సెట్స్ మీద ఉన్నాయి. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కూడా ప్రస్తుతం సెట్స్పై ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ సాగుతోంది.
అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో వర్క్ చేస్తారనే దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ చాలా మంది దర్శకుల పేర్లు మాత్రం వినిపిస్తున్నాయట. ఇక తాజా సమాచారం మేరకు దర్శకుడు శ్రీవాస్తో బాలకృష్ణ మరో సినిమా చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇంతకు ముందు బాలకృష్ణ హీరోగా చేసిన ‘డిక్టేటర్’ సినిమాను శ్రీవాస్ డైరెక్ట్ చేశారు. అన్ని అనుకున్నట్లు కుదిరితే నెక్ట్స్ మూవీని శ్రీవాస్ డైరెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.
కానీ దర్శకులు బి.గోపాల్, పూరి జగన్నాథ్ లు కూడా బాలయ్యతో సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నారన్న వార్తలు ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు బి గోపాల్, బాలయ్య తో కథా చర్చలు జరిపినట్టు సమాచారం. కాగా బాలకృష్ణ, బి గోపాల్ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత దర్శకుడు శ్రీవాస్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందంటున్నారు.
మరి పైసా వసూల్తో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు పూరితో సినిమా వెనకబడేలా ఉందని అసలు ఉంటుందో లేదో అనే సందేహం కూడా సినివర్గాల్లో తలెత్తుతుందట. ఇలా బాలయ్యతో సినిమా తీయాలని పోటీపడుతున్న ముగ్గురు దర్శకుల్లో చివరికి బి. గోపాల్, డిక్టేటర్ కాంబినేషన్ ఒకే అయ్యాయంటూ వార్తలు వస్తున్నాయి. అంటే పైసా వసూల్ కాంబినేషన్ లేనట్టేనా అనే అనుమనం వస్తుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోందట.