Tollywood : గత ఏడాది నుంచి కరోనా క్రైసిస్ వల్ల సినిమా ఇండస్ట్రీ ఎంతటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొందో అందరికీ తెలిసిందే. వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పట్లో మళ్ళీ ఇండస్ట్రీ కోలుకోవడం కష్టం అని ప్రతీ ఒక్కరు మాట్లాడుకున్నారు. కాగా ఈ ఏడాది సంక్రాంతి పండుగకి రిలీజైన సినిమాల నుంచి నెమ్మదిగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. గత ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాలన్ని ఈ ఏడాది వరసగా రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోతే జాతి రత్నాలు, రంగ్ దే లాంటి సినిమాలు భారీ వసూళ్ళు రాబట్టి అందరికీ ఆశలు కలిగిస్తున్నాయి.
ఈ క్రమంలో ఈ నెలలో 5 భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ‘కింగ్’ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వైల్డ్ డాగ్’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల సందడి ‘వైల్డ్ డాగ్’తోనే మొదలు అవుతోంది. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. కోలీవుడ్ హీరో కార్తీ – రష్మిక మందన్న జంటగా నటించిన ‘సుల్తాన్’ సినిమా కూడా ఇదే రోజు రిలీజ్ కానుంది.
Tollywood : పవన్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత రావడంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కి రెడీ అయింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన సినిమా దిల్ రాజు – బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించే సినిమా కావడంతో అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత అక్కినేని నాగచైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టొరీ’ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ – అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!