Pesticides: పెరుగుతున్న జనాభా ను దృష్టిలో పెట్టుకుని సరిపడినంత ఆహారాన్ని అందించడం తప్పనిసరి. అలా అందాలి అంటే పంటలు బాగా పండించడం తప్ప మరో మార్గం లేదు . అలా సక్రమంగా పంట చేతికి రావాలంటే పురుగు మందులు వాడక తప్పదు.అయితే విచ్చల విడిగా క్రిమిసంహారక మందులు వాడటం వల్ల పర్యావరణం తో పాటు మానవ ఆరోగ్యం, పైన తీవ్ర ప్రభావం చూపుతుంది .పురుగు మందులు లలో ఉండే అధిక విషపదార్థాల వల్ల ప్రతిమ ఏటా రెండు లక్షల మంది మరణిస్తున్నారు. దీనితో పాటు దీర్ఘకాలం ఈ రసాయనాల ను వాడిన ఆహారం తీసుకోవడం వలన అల్జీమర్స్, క్యాన్సర్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు వస్తున్నాయి. హార్మోన్లలో అవరోధాలు, ఎదుగుదలకు సంబంధించిన వ్యాధులు , వంధ్యత్వం వంటివి ఉత్పన్నం అవుతున్నాయి. క్రిమి సంహారకాలతో ఆహారం కలుషితం కావడం వల్ల చిన్నారులపై నా తీవ్ర దుష్ప్రభావం పడుతుంది.అయితే అన్ని పండ్ల తోటలకు ఒకే రకం గా పురుగు మందులు వాడారు.. వాటి గురించి తెలుసుకుందాం.
దానిమ్మ,యాపిల్, ద్రాక్ష పండ్ల తోటల కు పురుగులు బాధ ఎక్కువగా ఉంటుంది . దీంతో ఈ పంటలకు ఇంచుమించు ప్రతిరోజూ పురుగు మందులు వాడతారు. దీంతో ఈ పురుగు మందులు ఈ కాయ లోనికి చొచ్చుకు పోవడం జరుగుతుంది . బజారు నుంచి ఈ పండ్లు తెచ్చిన తర్వాత ఉప్పు నీటిలో నానబెట్టి కడిగితే కాయలు పైన ఉండే అవశేషాలు తొలగిపోతాయి. కానీ, లోన ఉన్న పురుగుమందు అవశేషాలు మాత్రం పోవు. కనుక వీటిని తక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది. ఇక అసలు పురుగు మందులు వాడని పండ్లు కూడా ఉన్నాయి. వాటి గురించి చూద్దాం
సపోటా,జామకాయలు, సీతాఫలం, నాటు రేగు కాయలు,కర్బూజ పండ్ల కు అసలు పురుగు మందులు వాడరు. కనుక వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు. ఇక బత్తాయి,నారింజ, కమలా పండ్లు బాగా పెరగడానికి బలం మందులు వాడతారు కానీ పురుగు మందులు వేయరు . కనుక వాటిని కూడా నిరభ్యంతరంగా ఏ వయసు వారైనా తీసుకోవచ్చు. నారింజ రసం నేరుగా పరగడుపున త్రాగ కూడదు. నారింజ రసం సగం నీళ్లు కలుపుకుని త్రాగడం వలన ఎలాంటి సమస్య ఉండదు.