సరిగ్గా వేసవి సమయంలో సినిమా ఇండస్ట్రీకి మంచి వ్యాపారం జరగాల్సిన క్రమంలో మహమ్మారి కరోనా వైరస్ వచ్చి అడ్డుకట్ట వేసింది. వేసవి ని టార్గెట్ చేసుకుని అప్పటికే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. కాగా కరోనా రావటంతో కేంద్రం లాక్డౌన్ నిర్ణయం తీసుకోవడంతో… సినిమా హాలు మొత్తం క్లోజ్ అవడంతో పరిస్థితి పూర్తిగా తారుమారు అయిపోయాయి. కాగా ఇటీవల సినిమా ధియేటర్లు ఓపెన్ చేసుకునే అవకాశం ప్రభుత్వాలు ఇవ్వటంతో… సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీ.
పూర్తి విషయంలోకి వెళితే సంక్రాంతి పండుగ నాటికి పూర్తిస్థాయిలో లో సినిమా థియేటర్లు తెరుచుకుంటాయి కాబట్టి… తమ సినిమాలను సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేయాలని స్టార్ హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సినిమాల పోస్టర్లు, టీజర్లు పెను దుమారాన్ని రేపుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్న క్రమంలో ఈసారి బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పండుగకు పోటీ భారీగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం….రానా దగ్గుబాటి నటిస్తున్న అరణ్య, పవర్ స్టార్ వకీల్ సాబ్, రామ్ నటించిన రెడ్, రవితేజ క్రాక్, నితిన్ నటిస్తున్న రంగ్ దే సినిమాలతో పాటు అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్టు ఇటీవల దసరా పండగ సందర్భంగా ప్రకటించారు.
అంతేకాకుండా నాగ చైతన్య నటిస్తున్న లవ్ స్టోరీ, నాని టక్ జగదీష్, శర్వానంద్ శ్రీకారం సినిమాలు కూడా సంక్రాంతి రేసులోనే పోటీ పడటానికి రెడీ అవుతున్నట్లు టాక్. వాస్తవానికి ఈ సినిమాలు వైరస్ రాకపోయి ఉంటే సగానికి సగం సినిమాలు వేసవిలో రిలీజ్ కావలసినవి. కానీ వైరస్ రావడంతో సీన్ మొత్తం మారటంతో వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి.