దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా రౌద్రం రణం రుథిరం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, ఓలియా మోరిస్..ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో ఫస్ట్ ఫాన్ ఇండియా స్టార్ గా బాహుబలి ఫ్రాంఛైజీతో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ సినిమాల తర్వాత నుండి ప్రభాస్ నటిస్తున్న ప్రతీ సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే నిర్మితమవుతోంది. సాహో పాన్ ఇండియా సినిమాగా రిలీజై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినప్పటికి బాలీవుడ్ లో సత్తా చాటింది. అంతేకాదు దాదాపు 450 కోట్ల పైగానే వసూళ్ళు రాబట్టింది. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యాం, అలాగే వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతున్నాయి.
సైరా నరసింహా రెడ్డి సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. కొణిదెల ప్రొడక్షన్స్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మించిన ఈ సినిమా మంచి లాభాలను తీసుకు వచ్చింది. ప్రస్తుతం ఇదే ప్రొడక్షన్ లో చిరంజీవి హీరోగా మరో రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా నిర్మిస్తున్నాడు రాం చరణ్. అందులో ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా కాగా మరో సినిమా మళయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసీఫర్ కి తెలుగు రీమేక్. ఈ సినిమాలో చిరంజీవి పొల్టికల్ లీడర్ గా కనిపిస్తారని సమాచారం. సాహో ఫేం సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడు.
రెండేళ్ళ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ కి అఫీషియల్ రీమేక్ గా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ.ఎం రత్నం నిర్మాతగా ఒక సినిమా రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా భారీ బడ్జెట్ తో పీరియాడికల్ సినిమాగా పాన్ ఇండియా కేటగిరీలో బహుభాషా చిత్రంగా రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత టాకీ పార్ట్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో 27 వ సినిమాగా రూపొందుతుంది.
ఇక ఈ ఇయర్ ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. సర్కారు వారి పాట అన్న టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి పరశురాం దర్శకత్వం వహిస్తుండగా జీ.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్ధిక నేరస్థుడిగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక సెప్టెంబర్ నుంచి సర్కారు వారి పాట సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక భారీ బ్యాక్ సెట్ ని నిర్మించారట. అందులోనే ముందు చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలుస్తుంది.
ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రెండు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు. అల వైకుంఠపురములో సినిమాతో టాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డ్ ని సాధించిన అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప అన్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని 5 ప్రధాన భాషల్లో రిలీజ్ చేస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా .. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అలాగే సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో అల్లు అర్జున్ తన 21 వ సినిమాని రీసంట్ గా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందనుండగా గీతా ఆర్ట్స్ 2, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీం గా నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన 30 వ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తో చేస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా కేటగిరీలోనే రూపొందిస్తున్నారు. హారిక అండ్ హాసిని, ఎన్.టి.ఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని సమాచారం. అలాగే మరో సినిమాని మైత్రీ మూవి మేకర్స్ లో చేయబోతున్నాడు ఎన్.టి.ఆర్. ఈ సినిమా ఎన్.టి.ఆర్ 31 వ సినిమాగా రూపొందనుండగా కే.జీ.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమా కూడా పాన్ ఇండియా కేటగిరీలోనే తయారవనుంది.
ఇక డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న సినిమా కూడా నాలుగు భాషల్లో పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతుంది. విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ సినిమాని పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నుంచి పూరి జగన్నాధ్ తన నిర్మాణంలో రూపొందించబోయో సినిమాలన్ని పాన్ ఇండియా కేటగిరీలోనే తెరకెక్కిస్తాడట. ఇక రీసెంట్ గా తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన ని త్వరలో ప్రారంభించబోతున్నట్టు కూడా ప్రకటించాడు.
అలాగే మంచు ఫ్యామిలీ నుంచి కూడా రెండు సినిమాలు పాన్ ఇండియా కేటగిరీలో నిర్మితం అవుతున్నాయి. మంచు మనోజ్ నటిస్తున్న సినిమా అహం బ్రహ్మాస్మి కాగా మరొకటి మంచు విష్ణు నటిస్తున్న బహుబాషా చిత్రం మోసగాళ్ళు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు అడవి శేష్ నటిస్తున్న మేజర్, నిఖిల్ నటిస్తున్న కార్తికేయ 2, కోన వెంకట్ నిర్మాణంలో తెరకెక్కబోతున్న కరణం మల్లీశ్వరి బయోపిక్, ఆది సాయి కుమార్ నటించబోతున్న సినిమాలు టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు గా రూపొందనున్నాయి.