వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్.. కొద్ది కాలంలోనే పాపులారిటీ సంపాదించుకుంది.. సాధారణం గా సినీ తారాగణం అంతా షూటింగ్ కి లగ్జరీ కార్ల లో వెళ్తరన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే రకుల్ అందుకు భిన్నంగా సైక్లింగ్ చేస్తూ షూటింగ్ కి వెళ్తుంది.. ఈ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చకర్లు కొడుతున్నాయి.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం రండి..
రకుల్ ప్రీత్ సింగ్ మేడ్ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నాడు. మేడ్ సినిమా షూటింగ్ కోసం ప్రతిరోజు 12 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ షూటింగ్ ప్రదేశానికి వెళ్తుంది. రకుల్ భద్రత కోసం ఆమెతో పాటు ఒక కారు లో సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణిస్తున్నారు.రకుల్ తన బాడీ ఫిట్నెస్ కోసం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రతి రోజు ఆమె సైక్లింగ్ చేస్తూ షూటింగ్ స్పాట్ కి వెళ్తున్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి.
అందుకే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సెలబ్రెటీలు సైక్లింగ్ పై అవగాహన పెంచడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. వాహనాల సంఖ్య పెరుగుతున్న కారణంగా ప్రజలు భయంతో ఊబకాయంతో బాధపడుతున్నారు. అంతేకాకుండా వాయు కాలుష్యం కూడా పెరిగిపోతుంది. వాయు కాలుష్యం తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రకుల్ సైకిల్పై షూటింగ్ వెళ్తున్న ఫోటోలపై విపరీతమైన లైక్ ల తో పాటు ఆమె ఫిటినెస్ సీక్రెట్ ఇదేనా అంటూ కామెంట్ చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?