నేటి ఆధునిక కాలం లో ఎన్నో మార్పులు వచ్చాయి .. అదేవిధంగా వివాహ విషయం లో కూడా రాకూడని మార్పులు వచ్చాయి . అర్ధం పర్ధం లేని ఒక వేడుకగా వివాహం మిగిలింది అనడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. హంగులు ఆర్భాటాలు తప్ప వేదమంత్రాలకు వెలువ లేకుండా పోయినది. ఇంకా చెప్పాలంటే వివాహం లో అత్యంత పవిత్రమైన మాంగళ్య ముహూర్తానికి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ముహూర్తం దాటాక మాంగల్యధారణ చేస్తున్నారు. అలా చేయడం వలన అన్యోన్యత లేకపోవటం, చిత్తచాంచల్యం, మనోవైకల్యం, మంచి సంతానం పొందలేకపోవడం వంటివి జరుగుతాయి.
వివాహం లో తప్పనిసరిగా చేయవలిసిన ఇంకొక పని జీలకర్ర బెల్లంపెట్టుకున్న తర్వాత వధువరులు తప్పకుండా ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ చూపులు నిలపాలి. తప్ప వీడియోలు ఫోటోల వైపు చూడటంసరైనది కాదు. అవి తీపి జ్ఞాపకాలే కావొచ్చు, కానీ ఆ తీపి ఫొటోలో తప్ప జీవితం లో ఉండదు అని గుర్తుపెట్టుకోండి అలా చూపులు నిలపకపోవటం వలన భార్యాభర్త ల మధ్య ప్రేమ, సంస్కారం లోపించటం వంటివి జరుగుతాయి .
బియ్యపు తలంబ్రాల కు బదులు లేదా వాటిలో థర్మాకోల్ మరియు రంగుల పూసలు కలిపి తలమీద పోసుకోవటం, వధూ వరుల మీద స్నో స్ప్రే కొట్టి నురగ పడేటట్టు చేయడం బహుదోషం గా చెప్పబడింది. అలా చేయడం వలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బదులు తప్పవు అని గుర్తుపెట్టుకోవాలి
వధూవరులని ఆశీర్వదించేటప్పుడు బంధువులు చెప్పుల కాళ్లతో ఉండడం వలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోతారు. ఫలితంగా జీవితంలో ఇబ్బందులు పడవలిసి వస్తుంది.
బఫే భోజనాలు పెట్టడం వలన స్థిరం గా వచ్చిన అతిధి కూర్చుని భోజనం చేయక పోవడం వలన
అన్నదాన ఫలితం పొందలేరు. మైకుల్లో వేదమంత్రాలు వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం వలన దైవ కటాక్షం దూరమవుతుంది. ఇది వరకు కాలం వారు అన్ని నియమాలు పాటిస్తూ వివాహం ఒక యజ్ఞం లా చేసుకునే వారు కాబట్టి కలకాలం సిరిసంపదలతో అన్యోన్య దాంపత్యం తో జీవితాం అంతా బ్రతికే వారు.
అంతే కాదు వారు నిషిద్ధ రోజులలో, సమయాలలో శృంగారనికి దూరం గా ఉంటూ మంచి సమయం లో సంతానాన్ని పొందేవారు.. అందుకే అప్పటిలో ఇంతటి క్రూర మనుషులు ఉండేవారు కాదు. కానీ ఇప్పటి పరిస్థితులు దానికి పూర్తిగా భిన్నం గా ఉన్నాయి. విచ్చలవిడిగా సమయం తో పనిలేకుండా శృంగారం చేయడం వలన రాక్షసులు పుట్టుకొస్తున్నారు. ఇది ప్రతిఒక్కరు అలోచించి మార్చుకోవాలిసిన విషయం .
ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు చేస్తూనే ఉంటున్నారు .
అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి ఆశీర్వచనాలతో జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా ఉండండి..
అందరికి చెప్పండి, తెలిసి చెప్పకపోతే తప్పు, చెప్పినా పాటించక పోతే అదివారి కర్మ. శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేసినవే.
వేదమంత్రాలు,శాస్త్రోక్తం గా వివాహం చేసుకోక పొతే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని.. 15000 మంది దంపతుల ను గడచిన 20 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసం. అందరికి అందేలా చూడండి.