కంటికి కనిపించని కరోనా వైరస్ చైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు వ్యాపించి రోజురోజుకు విజృంభిస్తూనే ఉంది. ఈ కరోనా వైరస్ కట్టడి కోసం శాస్త్రవేత్తలు టీకా ను కనుగొనడాకి కష్టపడుతూనే ఉన్నారు. కాగా ఇప్పటికే కొన్ని సంస్థలు మేము టీకాలు తయారు చేశామంటూ వచ్చే ఏడాదికి టీ కాను అందరికీ అందుబాటులోకి తెస్తామంటూ ప్రకటిస్తున్నారు. అయితే టీకా వచ్చినా చాలా మంది జనాలు టీకా ను వేసుకోవడానికి మొగ్గుచూపడం లేదని ఇటీవలె ఒక అధ్యయనంలో తేలింది. ఇదిలా ఉంటే మరొక కొత్త అధ్యయనంలో శాస్త్రవేత్తలు సరికొత్త అంశాన్ని వెలుగులోకి తెచ్చింది.
ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అదేటంటారా.. కరోనా వచ్చి తగ్గినవారికి అసలు టీకానే అవసరం లేదంటా.. దీనికి కారణాలు లేకపోలేదు. అదేంటంటే కరోనా నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అలాగే వారి శరీరంలో ఈ వైరస్ నుంచి కాపాడే వ్యాధి నిరోధక కణాలు కూడా అవసరమైనన్నీ తయారై ఉంటాయట. అందుకని వీరికి వ్యాక్సిన్ ను పదే పదే ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే కరోనా నుంచి కోలుకున్న వారి పరిస్థితిని తెలుసుకోవడానికి పలువురు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ప్రయోగాలు చేశారు.
అందులో భాగంగా 19 ఏండ్ల నుంచి 81 ఏండ్ల మధ్య వయసులో ఉన్న 185 కరోనా బాధితుల రక్తాన్ని తీసుకుని పరీక్షించారు. అందులో భాగంగా వారు ఆసక్తి కరమైన విషయాలను వెళ్లడించారు. కరోనా బాధితుల శరీరంలో కరోనా వైరస్ తో పోరాడే బీ, టీ లింపోసైట్ కణాలు చాలా మటుకు పెరిగినట్లు కనిపించిందని తెలిపారు. అలాగే ఆ పెరిగిన కణాలు సంవత్సరాల కొద్దీ శరీరంలో ఉంటాయి. అలా ఉండి అవి శరీరాన్ని రీ ఇన్ ఫెక్షన్ కు గురి కాకుండా కాపాడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
అలాగే కరోనా బాధితుల్లో రోగనిరధక వ్యవస్థపై ఎప్పుడు దాడిచేసినా వాటిని సమర్థవంతంగా పోరాడే శక్తిని కలిగి ఉందని నిపుణులు తెలిపారు. మరీ ముఖ్యంగా కోవిడ్ బాధితుల శరీరాల్లో వైరస్ ను చంపే దశలో యాంటీబాడీలు ఆలస్యంగా కనుమరుగవుతున్నాయని వెళ్లడించారు. అయిలే ఎప్పుడూ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇలాగే ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేమని శాస్త్రవేత్తలు, నిపుణులు స్పష్టం చేశారు. అలాగే కరోనా వైరస్ తో హాస్పటల్ల చుట్టూ తిరిగేవారి సంఖ్య రోజురోజుకు తగ్గే అవకాశాలున్నాయని వారు వెళ్లడించారు.