ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరో మెట్టు పైకెక్కాడు సత్య దేవ్. గతంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మీ సినిమాతో పాపులర్ అయిన సత్య దేవ్ ఒక్కో సినిమాతో ప్రేక్షకుల్లో క్రేజ్ ని సంపాదించుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్య హీరో అన్న ఇమేజ్ ని సంపాదించుకున్నాడు కూడా. ఇటీవల వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో ఇంకా బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా ప్రేక్షకుల తో పాటు ఇండస్ట్రీ వర్గాల అందరినీ ఆకట్టుకోవడం తో పాటు గొప్ప ప్రశంసలు దక్కించుకున్నాడు.
ఇక తాజాగా మరో సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా గుర్తుందా శీతాకాలం అన్న టైటిల్ ని ఫిక్స్ చేశారు. కాగా కరీనా లాక్ డౌన్ తర్వాత అన్ని సినిమాలు షూటింగ్ మొదలైనప్పటికి ఈ సినిమా మాత్రం ఇంకా సెట్స్ మీదకి రాలేదు. దాంతో సోషల్ మీడియాలో ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం జోరుగా జరిగింది. అందుకే మేకర్స్ ఈ సినిమా ఆగిపోలేదన్న క్లారిటి ఇవ్వడానికి మైండ్ బ్లాకయ్యే అనౌన్స్ మెంట్ ఒకటి ఇచ్చారు.
అదేమిటంటే ఈ సినిమాకి నటీనటులు కావాలి అన్న ప్రకటన. సత్యదేవ్ తో కూడుకున్న ఈ ప్రకటనలో 12-15 ఏళ్ళ వయసు వారు కావాలని స్పష్టం చేశారు. అయితే తమన్నా సినిమాకి కాస్టింగ్ కాల్ ఏంటన్న సందేహాలు కొంతమందిలో కలుగుతున్నాయట. ఏదేమైనా మొత్తానికి తమన్నా – సత్యదేవ్ ల కాంబినేషన్ లో ప్రకటించిన గుర్తుందా శీతాకాలం ఆగిపోయిందన్న రూమర్స్ కి చెక్ మాత్రం పెట్టారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో త్వరలో వెల్లడించనున్నారని సమాచారం.