Ys Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి ఎక్కడా కూడా అవినీతికి తావులేకుండా టెండర్ల విషయంలో .. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ప్రజాధనం వృధా కాకుండా కీలక అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ విద్యుత్ విషయంలో కూడా అదే రీతిలో పాలన అందిస్తూ ఉంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే క్కువ ధరకే విద్యుత్ కొని వెయ్యి కోట్లకు పైగా ఆదా చేయడాన్ని ప్రశంసించి అన్ని రాష్ట్రాలు జగన్ నాయకత్వం లోని AP ని రోల్ మోడల్ గా తీసుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ సూచించింది.
Ys Jagan Mohan Reddy : విద్యుత్ కొనుగోలు విషయంలో టాప్:-
పూర్తి విషయంలోకి వెళితే దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్కరణల విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది. 2020-2021 విద్యుత్ కొనుగోలు ఖర్చులో ఆంధ్రప్రదేశ్ 1023 కోట్లు ఆదా చేయడం జరిగింది అని కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవల నీతి అయోగ్ సమావేశం జరిగిన ఈ క్రమంలో ఈ కితాబు ఆంధ్రాకు వచ్చింది. కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్..రాష్ట్ర విద్యుత్ శాఖ పురోగతిని ప్రత్యేకంగా ప్రస్తావించడం తోపాటు చౌక విద్యుత్ కి అత్యధికంగా ప్రాధాన్యం ఇవ్వటం లో జగన్ ప్రభుత్వం ముందుందని తెలపడం జరిగింది. గత ఏడాది జూన్ నుండి ఇప్పటి వరకు విద్యుత్ కొనుగోలు లో ఆదా చేసే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకంగా రాణిస్తున్నట్లు ప్రశంసల వర్షం కురిపించారు.
సరికొత్త సంస్కరణలతో ప్రజాధనం ఆదా:
ముఖ్యంగా 2020-2021 విద్యుత్ కొనుగోలు ఖర్చులో ఒక యూనిట్ విద్యుత్ ని నాలుగు రూపాయల యాభై ఐదు పైసలు కొనుగోలు చేసే రీతిలో విద్యుత్ నియంత్రణ మండలి అనుమతిస్తే, విద్యుత్ సంస్థలు కొనుగోలు ధరలు మూడు రూపాయల 12 పైసలకే తగించి రాష్ట్ర ప్రభుత్వం రాణించడం పట్ల ప్రత్యేకంగా కేంద్రం అభినందించినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా విభజనతో ఆర్థికంగా నష్టపోయినా రాష్ట్రంలో చాలా విషయాలలో జగన్ ప్రభుత్వం సరికొత్త సంస్కరణలతో ప్రజాధనం ఆదా చేసే రీతిలో నిర్ణయాలు తీసుకోవడం పట్ల కేంద్ర స్థాయి నుండి ప్రశంసలు రావడం తో వైసీపీ శ్రేణులు ఫుల్ హ్యాపీ గా ఉన్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?