Covid 19: ప్రస్తుతం భారతదేశంలో విలయతాండవం చేస్తున్న కోవిడ్ సెకండ్ వేవ్ తాకిడి కొద్దిగా తగ్గుతోంది. అయినప్పటికీ ఈ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు అనే చెప్పాలి. కొన్ని వారాలు ముందే సైంటిస్టులు రెండవ వేవ్ లాగానే మూడవ వేవ్ కూడా ఉంటుందని అందులో కొత్త వైరస్ వేరియంట్లు ప్రజల పై దండెత్తుతాయని తేల్చిచెప్పేశారు.
అంతేకాకుండా మూడవ వేవ్ చిన్న పిల్లలపై ప్రభావం చూపిస్తుందని వార్తలు కూడా వస్తున్నాయి. వీటిలో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఇలాంటి కరోనా వైరస్ లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ వేవ్ లు అనేవి సర్వసాధారణం. వీటికి వ్యాక్సినేషన్ ఒకటే మార్గం. అయితే ఇప్పుడు కొత్తగా మరొక వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం 2డోసుల లో వాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది… కానీ భవిష్యత్తులో మూడవ డోస్ అవసరం పడే అవకాశాలు కూడా ఉన్నాయట.
ప్రస్తుతం భారతదేశంలో ప్రజలందరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. దీంతో రోగ నిరోధక శక్తి పెరిగి యాంటీబాడీలు శరీరంలో ఉత్పత్తి అవుతాయి అన్న అధ్యయనాలు ఉన్నాయి. అయితే రాబోయే వేవ్ లలో సరికొత్త వైరస్ వేరియంట్ ల తో పోటీపడవలసి ఉంటుంది. అందుకు మూడవ డోస్ వ్యాక్సినేషన్ కూడా అవసరం అయ్యే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. ఇదే కనుక జరిగితే భారతదేశంలో మళ్లీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదటి నుండి చేపట్టినట్లు అవుతుంది.
అందుకే భారతదేశం కూడా ముందు జాగ్రత్తగా బయట దేశాల్లో ఉండే వ్యాక్సిన్ లకు ఇక్కడ ట్రయల్స్ జరిపేందుకు అనుమతులు ఇచ్చేసింది. మరికొన్ని నెలల్లో కనీసం నాలుగు లేదా ఐదు రకాల వ్యాక్సిన్లు దేశ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అప్పుడు మూడు డోసులు ప్రక్రియ మొదలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.